Nagarjuna Akkineni Shocking Comments on Sobhita: ఫైనల్‌గా శోభితా ధూళిపాళతో తన రిలేషన్‌ని ఆఫీషియల్‌ చేశాడు అక్కినేని హీరో నాగచైతన్య. కొంతకాలంగా వీరిద్దరు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ ఎంతోకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అవి నిజమే అన్నట్టు వీరిద్దరు రెస్టారెంట్‌కు, ఫారెన్‌ టూర్లకు వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ ఎప్పుడు వీరిద్దరు తమ రిలేషన్‌పై పెదవి విప్పలేదు. కానీ, సడెన్‌గా ఇవాళ (గురువారం) నిశ్చితార్థం చేసుకున్ని షాకిచ్చారు. ఆగష్టు 8న నాగచైతన్య-శోభితలు ఉంగరాలు మార్చుకున్నారు.


ఈ విషయాన్ని ఆయన చై తండ్రి నాగార్జున అక్కినేని స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు నిశ్చితార్థం ఫోటోలు షేర్‌ చేస్తూ నాగచైతన్య-శోభితాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య-శోభితాల నిశ్చితార్థం ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కాబోయే కోడలు శోభితా గురించి నాగార్జున గతంలో చేసన కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. శోభితా చాలా హాట్‌ ఉందంటూ నాగ్ మూవీ ఈవెంట్‌లో శోభితా గురించి చెప్పుకొచ్చాడు. 2018లో అడవి శేష్‌, శోభితా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుఢాచారి'.  ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న నాగార్జున శోభితాపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 



ఈ సినిమాలో శోభితా ధూళిపాళ చాలా అందంగా ఉంది. అనకూడదు కానీ. ఆమె చాలా హాట్‌గా కనిపించింది. తనలో అందరినీ అట్రాక్ట్‌ చేసే శక్తి ఉంది. ఇందులో తన పాత్ర చాలా బాగుంది. టెర్రరిస్టుల స్పై అనే తెలియకుండ ఆమె పాత్ర చాలా చక్కగా దాచారు. ఈ సినిమాలో అడవి శేష్ ఎలా కావాలో అలా ఉంది ఈ అమ్మాయి. నిజంగా చాలా చాలా అందంగా ఉది. అందమే కాదు ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది" అంటూ కామెంట్స్ చేశారు. కాబోయే కోడలిపై గతంలో నాగ్ చేసిన ఈ కామెంట్స్‌ని ప్రస్తుతం నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. దీనిపై కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 







కాగా నాగచైతన్య శోభితాను నిశ్చితార్థం చేసుకోవడాన్ని చై-సామ్‌ ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడాకులైన ఎప్పుటికైన ఈ మాజీ జంట కలుస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు చై శోభితాను ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని షాకిచ్చాడు. కాగా నాగచైతన్య-సమంతలది కూడా ప్రేమ వివాహమే అనే విషయం తెలిసిందే. ఏం మాయ చేశావే మూవీ టైంలో కులుసుకున్న వీరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అలా పదేళ్లు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు 2017లో పెద్దల సమక్షంలో గోవా అంగరంగవైభవం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ క్యూట్‌ కపుల్‌ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంతతో విడాకులు అనంతరం నాగచైతన్య, శోభితాకు దగ్గరయ్యాడు. వీరిద్దరు రిలేషన్‌ ఉన్నారంటూ వస్తున్న పుకార్లను నిజం చేస్తూ నేడు ఈ జంట ఉంగరాలు మార్చుకుంది. నాగచైతన్య ఇంట్లోనే సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది.



Also Read: నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్‌ - నెట్టింట సమంత రియాక్షన్‌, హార్ట్‌ బ్రేకింగ్‌ అంటూ పోస్ట్‌...