Guntur Kaaram : ఈసారి సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది. స్టార్, సీనియర్ హీరోలంతా తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నారు. అలా సంక్రాంతి బరిలో దిగుతున్న అన్ని సినిమాల్లో ‘గుంటూరు కారం’ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేయడానికి మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో ముచ్చటించారు నిర్మాత నాగవంశీ. ఫ్యాన్స్‌కు డౌట్లను క్లియర్ చేస్తూ.. ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చారు.


సంక్రాంతికి హిట్ ఫిక్స్..
‘‘నేను చెప్తున్నాను కదా.. సినిమా బాగుంది. ఫ్యాన్స్‌గా దానిని ఏ రేంజ్‌కు తీసుకెళ్తారో తీసుకెళ్లండి. నేను ఎగ్జైట్ అవుతున్నాను. నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. మీరు వదిలేయండి దాని గురించి’’ అంటూ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో ముచ్చటించడమే కాకుండా వారికి ‘గుంటూరు కారం’ కచ్చితంగా హిట్ అవుతుందని భరోసా ఇచ్చారు నాగవంశీ. అయితే అంత పెద్ద నిర్మాత అయినా కూడా తమతో మాట్లాడడానికి, డౌట్లు తీర్చడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పోస్టర్లు, పాటలు బాగున్నాయని ప్రశంసించారు.


ఇద్దరు సూపర్ స్టార్లు..
‘‘సినిమా చాలా బాగుంది. చివరి 45 నిమిషాలు అదిరిపోయింది. ఎమోషన్స్ గానీ, ఫైట్స్ గానీ, పాటలు గానీ అన్ని బాగున్నాయి. కుర్చీ మడతపెట్టే పాట, ఒక ఫైట్ అన్నీ చివరి 45 నిమిషాల్లోనే వస్తాయి. ఫస్ట్ హాఫ్ కూడా అదిరిపోయింది. తమన్.. ఆర్ఆర్ ఇరగదీశాడు’’ అని చెప్తూ ఫ్యాన్స్‌లో ‘గుంటూరు కారం’పై ఉన్న హైప్‌ను మరింత పెంచేశారు నాగవంశీ. అంతే కాకుండా.. బయట ఎప్పుడూ చెప్పలేదు, ఫ్యాన్స్ గ్రూప్‌లో చెప్తున్నాను అంటూ మూవీ గురించి ఒక సీక్రెట్ కూడా రివీల్ చేశారు. ‘‘ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫైట్‌లో ఇద్దరు సూపర్ స్టార్లను చూస్తున్న ఫీల్ వస్తుంది. అవన్నీ బాగా రివీల్ అవుతాయి’’ అని బయటపెట్టారు. ఇక రాత్రి 1 గంట షోల గురించి చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ చర్చలు సక్సెస్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 1 గంట షోలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు నాగవంశీ.


ట్రైలర్ వచ్చేది అప్పుడే..
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘అతడు’, ‘ఖలేజా’లాంటి హిట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో వీరి కాంబినేషన్‌కు క్రేజీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులు సంతోషపడిపోయారు. వారి అంచనాలకు తగినట్టుగానే మహేశ్ బాబును లుంగీతో, బీడీతో మాస్ లుక్‌లో చూపించాడు త్రివిక్రమ్. ఇక ఇటీవల విడుదలయిన ‘కుర్చీని మడతపెట్టి’ పాట అయితే ఒక్కసారి మాస్ ఫ్యాన్స్ అందరినీ ఎగ్జైట్ చేసేసింది. మహేశ్ బాబు, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు యూత్‌ను ఉర్రూతలూగించాయి. ఇక ఫ్యాన్స్ మీట్‌లో ‘గుంటూరు కారం’ ట్రైలర్ గురించి కూడా నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. జనవరి 6న ‘గుంటూరు కారం’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు.


Also Read: గర్ల్‌ఫ్రెండ్‌తో ‘దసరా’ నటుడి ఎంగేజ్‌మెంట్ - సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్