Naga Shourya : టాలీవుడ్ లో నటించింది, హిట్ కొట్టింది కొన్ని సినిమాలే అయినా.. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. గత కొంత కాలంగా విజయాలకు ఆమడ దూరంలో ఉన్న ఆయన.. ఇటీవల ఓ వీడియోతో వార్తల్లో నిలిచాడు. రోడ్డుపై ఒక అమ్మాయిని కొడుతుండగా వెళ్లి.. ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లై కి షాకై.. అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. కాగా ఈ సమయంలో అసలు ఏమైంది. ఆ అమ్మాయి ఏమని సమాధానం ఇచ్చింది అన్న విషయాలను తాజాగా నాగ శౌర్య పంచుకున్నాడు. 


నాగ శౌర్య లేటెస్ట్ మూవీ 'రంగబలి' సినిమాకు సంబంధించిన టీజర్ ను మూవీ యూనిట్ మంగళవారం అంటే జూన్ 27న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.. ‘రంగబలి’ మూవీ యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్.. నాగ శౌర్యను అడిగిన ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచింది. రీసెంట్‌గా ఒక అబ్బాయి రోడ్డుపైన అమ్మాయిని ఏడిపిస్తుంటే.. మీరు వెళ్లి కొట్టారు కదా? అంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘‘నిజం చెప్పాలంటే అతన్ని నేను కొట్టలేదు. నేను ఏదో పని మీద వెళ్తుంటే.. ఓ అమ్మాయిని ఒక అబ్బాయి కూకట్‌పల్లిలో రోడ్డు మీద కొడుతున్నాడు. అది చూసి ఆగి ఎందుకు కొడుతున్నావని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. మీకేంటి అని రివర్స్‌ అయింది’’ అని తెలిపాడు. 


‘‘అందుకే అమ్మాయిలకు చెప్తున్నా.. కొట్టే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. ప్రేమగా చూసుకునే వాళ్లతో తప్ప.. కొట్టినా, తిట్టినా భరిస్తామని పెళ్లి చేసుకోవద్దు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్‌లో ఖచ్చితంగా అమ్మాయిదే తప్పు" అని నాగ శౌర్య అసలు విషయాన్ని చెప్పారు. అలా జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఏం చెప్పారనే ప్రశ్నకు బదులిస్తూ.. "అలా అన్నాక ఇంకేం చెప్తాం. అసలైతే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకున్నాను. కానీ, నన్ను చంపేసినా, కొట్టినా పర్లేదంటే ఏం చేయగలను. ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన కొంతమంది నేనేదో టీఆర్‌పీ రేటింగ్ కోసం ప్లాన్ చేశానన్నారు. నిజంగా వాళ్లెవరో నాకు తెలియదు" అని నాగ శౌర్య చెప్పుకొచ్చారు.


నాగ శౌర్య మూవీ విషయానికొస్తే.. ‘రంగబలి’ని.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు నటించారు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం.. జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటెంట్ చూస్తుంటే మాత్రం ఈసారి నాగశౌర్య పక్కా హిట్ కొడతాడనే ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


Read Also : 'ఆదిపురుష్' పని అయిపోయినట్టేనా? ఇంత తక్కువ కలెక్షన్లా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial