Karthik Varma Dandu : హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త నటించిన మిస్టిక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' ఈ సంవత్సరం టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి OTT స్పేస్‌లో కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు BVSN ప్రసాద్, సుకుమార్ కలిసి దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, సుకుమార్ కార్ కీస్‌ను కార్తీక్‌కు అందించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను దర్శకుడు కార్తీక్ దండు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


తనకు 'విరూపాక్ష' నిర్మాతలు బహుమతిగా అందించిన మెర్సిడెస్ బెంజ్ కారును అందుకుంటున్న ఫొటోలను డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సుకుమార్ లతో కలిసి ఆయన ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. దాంతో పాటు విరూపాక్ష తనకు జీవితకాల జ్ఞాపకాలను మిగిల్చిందని పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తను గురువు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్, నా నిర్మాతలు BVSN ప్రసాద్, బాపినీడు భోగవల్లికి ధన్యవాదాలు తెలిపారు.


సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా విమర్శకుల నుంచి సైతం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు నుంచే 'విరూపాక్ష' దుమ్మురేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ హిట్ ఖాతాలో పడింది.






'విరూపాక్ష' సినిమాకు భారీ విజయం దక్కడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి తేజ్, డైరెక్టర్ కార్తిక్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిందంటూ చిరంజీవి చెప్పారు. ఇలానే మంచి సినిమాలతో కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశించారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త యాక్టింగ్‌కి కూడా మంచి పేరు వచ్చింది. అలానే సీరియల్ నటుడు రవికృష్ణ ఇందులో చేసిన కుమార్ పాత్రకు కూడా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. 


Read Also : షారుఖ్ ఖాన్ 'జవాన్' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial