Music Director Radhan: 'అర్జున్ రెడ్డి'.. తెలుగులో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌, హీరో విజ‌య దేవ‌ర‌కొండ పేరు మారుమోగేలా చేసింది ఈసినిమా. యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. ఇక సినిమాలో మ్యూజిక్ కూడా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. పాట‌లు యువ‌త‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే, ‘అర్జున్ రెడ్డి’ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ‌తో క‌లిసి ప‌ని చేయ‌లేదు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రధన్ పై సిదార్థ రాయ్ డైరెక్ట‌ర్ కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు సందీప్ రెడ్డి, రధన్ ల ఇంట‌ర్వ్యూలు ఒక్క‌సారిగా ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి సోష‌ల్ మీడియాలో. 


ఎందుకు చేయ‌లేదు అంటే? 


‘అందాల రాక్ష‌సి’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్. ఆయ‌న చేసిన ప్ర‌తి సినిమాలోని మ్యూజిక్ సూప‌ర్ హిట్. పాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఎందుకు పెద్ద‌గా ఛాన్సులు రాలేదు అనే ప్ర‌శ్న‌కి ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. “అందాల రాక్ష‌సి.. చాలా పెద్ద హిట్ సినిమా. ఆ త‌ర్వాత ఛాన్సులు వ‌స్తాయి అనుకున్న‌. కానీ, అనుకోకుండా అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ వ‌ల్ల ఆమెను చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడు అశ్వినీ ద‌త్ గారు ఫోన్ చేసి ఒక మంచి సినిమాకి వ‌ర్క్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అదే 'ఎవ‌డే సుబ్ర‌హ్మణ్యం'.


ఆ త‌ర్వాత 'రాధ‌', 'మ‌న‌సుకు న‌చ్చింది', 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలు వ‌చ్చాయి. ఒక సినిమాని బిజినెస్ లాగా చూడ‌ను. ఒకేసారి నాలుగు సినిమాలు అలా చేయ‌ను. త‌మిళ్ లో, తెలుగులో ప్యార్ల‌ల్ గా చేశాను. పెద్ద హీరోల‌కు చేయాల‌ని ఉంది. కానీ, ఛాన్స్ లు రాలేదు. 'అర్జున్ రెడ్డి' వ‌చ్చిన‌ప్పుడు సందీప్ గారు కొత్త డైరెక్ట‌ర్. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌న్ను ఆయ‌న‌కు ప‌రిచ‌యం చేశారు. 'అర్జున్ రెడ్డి' అయిపోయిన త‌ర్వాత‌.. ‘హుషారు’ చేశాను. క‌రోనా వ‌ల్ల బ్రేక్ వ‌చ్చింది. చాలా లాంగ్ షెడ్యూల్స్ ఉండ‌టం వ‌ల్ల వేరే సినిమా ఒప్పుకోలేదు. ఒకేసారి నేను నాలుగు సినిమాలు చేయ‌గ‌ల‌ను. కానీ, అలా అవ్వ‌ద్దు. 'అర్జున్ రెడ్డి' త‌మిళ్ లో కూడా హిట్ అయ్యింది. మూడుసార్లు మ్యూజిక్ కంపోజ్ చేశాను. త‌మిళ్ లో సినిమా చేస్తున్న టైంలోనే హిందీలో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీస్తున్నారు. హిందీ ప్రేక్ష‌కుల కోసం కొత్త‌గా కంపోజ్ చేయించాల‌నే ఉద్దేశంతో నాకు హిందీ ‘అర్జున్ రెడ్డి’లో అవ‌కాశం ఇవ్వ‌లేదు” అని మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ క్లారిటీ ఇచ్చారు. 


కాంట్ర‌వ‌ర్సీలో రధన్.. 


ఇది ఇలా ఉంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ పై సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. 'సిదార్థ రాయ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ య‌శ‌శ్వి.. రధన్ గురించి కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పాత కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 'అర్జున్ రెడ్డి' సినిమా టైంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్ త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టాడ‌ని, క‌ష్ట‌ప‌డి, బ‌తిమ‌లాడుకుని మ్యూజిక్ డైరెక్ష‌న్ చేయించుకున్నాన‌ని చెప్పారు సందీప్ రెడ్డి. 


ఇక ‘సిదార్థ రాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ య‌శ‌శ్వి కూడా రధన్ పై అలాంటి కామెంట్సే చేశారు. ఆయ‌న‌తో మాట్లాడ‌టం అంటే కొట్లాడ‌ట‌మే అని, చాలా ఇబ్బందులు పెట్టాడ‌ని, ఆయ‌న వ‌ల్లే సినిమా డిలే అయ్యింది అంటూ కామెంట్స్ చేశారు య‌శ‌శ్వి. చెన్నైలో ఉన్నాడు కాబ‌ట్టి బ‌తికిపోయే వాడ‌ని, లేకుంటే క‌చ్చితంగా గొడ‌వ‌లు అయిపోయేవ‌ని అన్నారు. 


Also Read: వ్యూహం మళ్లీ వాయిదా - కానీ, ఈసారి లోకేష్‌ కారణం కాదు..