దళపతి విజయ్ చివరి సినిమాలో కేరళ కుట్టి మమిత బైజు (Thalapathy Vijay last movie actress)కు కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. 'దళపతి 69'లో ఛాన్స్ దక్కించుకొని వార్తల్లో నిలిచిన మమిత... అంత కంటే ముందే 'ప్రేమలు' (Premalu Actress)తో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. కానీ, ఈ బ్యూటీ గురించి చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. విజయ్ చివరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనగానే అసలు ఈ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి మమిత బైజు ఎంత వరకు చదువుకుందో ఎంత మందికి తెలుసు?


మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్
మలయాళ సినిమాల్లో నటించి అతి తక్కువ వయసులోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కేరళ కుట్టి మమిత  బైజు. అనూప్ మీనన్, అపర్ణ బాలమురళి, అను సితారాలతో కలిసి 'సర్వోపరి పాలకారన్' అనే సినిమాతో 2017లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆసిఫ్ అలీ, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడికి సక్సెస్ అంత ఈజిగా దక్కలేదు. హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అయితే హీరోయిన్ గా నటించిన 'ఆపరేషన్ జావా', 'కోకో' వంటి సినిమాల్లో ఆమె పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమలో మమిత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. 2022లో గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన 'సూపర్ శరణ్య' మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇందులో ఆమె 'సోనా థామస్' అనే అమ్మాయి పాత్రను పోషించింది. అక్కడ్నుంచి రోజు రోజుకూ సక్సెస్ ఫుల్ నటిగా ఎదుగుతూనే ఉంది మమిత బైజు. ఆ తర్వాత 'ప్రణయ విలాసం', 'రామచంద్ర బాస్ అండ్ కో' వంటి సినిమాలలో నటించిన ఈ బ్యూటీ 'ప్రేమలు' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన 'ప్రేమలు' మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 


Read Also : Matka Teaser: వరుణ్ తేజ్ 'మట్కా' టీజర్... హైలెట్స్ ఇవే - మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే, అదిరిందంతే!



జీవి ప్రకాష్ కుమార్ తో కలిసి 'రెబల్' అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మమిత. కానీ ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితకు మరో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ సరసన నటించే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్ తో కలిసి ఆయన 69వ సినిమాలో నటించడానికి రెడీగా ఉంది. ఈరోజు నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే మమితకు సంబంధించిన ఈ విషయాలు అందరికీ తెలుసు. ఇంకాస్త వెనక్కి వెళ్తే....


మమత బైజు కేరళలోని కిడంగూర్ లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. యుక్త వయసులోనే ఈ బ్యూటీ యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో చదువును కంటిన్యూ చేసింది. అయితే సినిమాలలో సక్సెస్ అయినప్పటికీ చదువును మాత్రం పక్కన పెట్టలేదు.  మమత బైజు కొచ్చిలోని సీక్రెట్ హార్ట్ కాలేజీలో సైకాలజీలో బీఎస్సీ చేస్తోంది. 16 సంవత్సరాల వయసులోనే ఈ బ్యూటీ 'సర్వరి పాలక్కారన్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సూర్య, బాలా సినిమాలో ఛాన్స్ దక్కినప్పటికి విబేధాల కారణంగా ఆ సినిమాకు గుడ్ బై చెప్పింది. అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదో భారతీయ చిత్రం 'ప్రేమలు'తో 24 ఏళ్ల వయసులోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఆమె ఒకరు.


Also Read: 'దేవర 2'లో ఆ రెండూ... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ లీక్ చేసిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్!