Animal Movie : తాజాగా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మూవీ టీమ్ అంతా హైదరాబాద్‌కు వచ్చింది. మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీంతో ఈ ఈవెంట్‌కు మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అంతే కాకుండా సినిమా గురించి, మూవీ టీమ్ గురించి, చీఫ్ గెస్ట్‌గా వచ్చిన మహేశ్ బాబు గురించి మాట్లాడారు. ‘యానిమల్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాలని విషెస్ తెలిపారు. ఎప్పుడు స్టేజ్‌పైకి వచ్చినా.. కెమెరా ముందుకు వచ్చినా తమ స్పీచ్‌తో అదరగొట్టే మల్లారెడ్డి.. మరోసారి ‘యానిమల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదరగొట్టారు. 


హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి..
ముందుగా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా వెల్‌కమ్ చెప్పారు మల్లారెడ్డి. ఆ తర్వాత మహేశ్ బాబు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘మీ బిజినెస్‌మ్యాన్ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా పదిసార్లు చూశాను. అది చూసే నేనే ఎంపీ అయ్యాను’’ అని బయటపెట్టారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు విని మహేశ్ మురిసిపోయాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్‌ గురించి మాట్లాడుతూ హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వమని సలహా ఇచ్చారు. ‘‘ముంబాయ్ పాతది అయిపోయింది. బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక హిందుస్తాన్‌లో ఒకటే సిటీ మిగిలుంది అదే హైదరాబాద్. అందుకే ఒక సంవత్సరంలోపు మీరు కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి’’ అంటూ రణబీర్ కపూర్‌కు సలహా ఇచ్చారు మల్లారెడ్డి.


రష్మిక చాలా స్మార్ట్..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్‌లో తెలుగువారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు మల్లారెడ్డి. ‘‘వచ్చే ఐదేళ్లలో బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటిని తెలుగువారు ఏలేస్తారు. తెలుగులో చాలా స్మార్ట్ మనుషులు ఉన్నారు. రాజమౌళి, దిల్ రాజులాంటి వారు ఉన్నారు. దిల్ ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సందీప్ కూడా వచ్చాడు. హైదరాబాద్ అనేది టాప్ మోస్ట్ అయిపోయింది. ఇక్కడివారు స్మార్ట్ అని చెప్పడానికి రష్మికనే ఉదాహరణ. పుష్ప సినిమాతో అదరగొట్టేసింది’’ అంటూ తెలుగువారిని తెగ ప్రశంసించారు.


రూ.500 కోట్ల కలెక్షన్ రావాలి..
‘‘నాలుగేళ్ల క్రితం ఈ నేలపై అశ్వమేథ యాగం జరిగింది. అందుకే ఇక్కడ నుండి ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇది పవిత్రమైన భూమి. ఇక్కడ మీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతుంది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది’’ అంటూ మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు మల్లారెడ్డి. ఇక డిసెంబర్ 1న ‘యానిమల్’ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌కు జోడీగా రష్మిక నటించింది. హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. బాబీ డియోల్.. విలన్ పాత్రను పోషించాడు. తెలుగు, హిందీల్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కూడా నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని ‘యానిమల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా. నిడివి ఎక్కువగా ఉన్నా సందీప్ మీద నమ్మకంతో చాలామంది ప్రేక్షకులు ‘యానిమల్’ను థియేటర్లలో చూడడానికి సిద్ధమవుతున్నారు.


Also Read: ‘జై బాబు’ అంటూ స్పీచ్‌ను ప్రారంభించిన రణబీర్, ‘పోకిరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply