Animal Movie : సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని మూవీ టీమ్ అంతా విరామం లేకుండా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిందీలో మాత్రమే కాకుండా ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ‘యానిమల్’ విడుదల అవుతుండగా.. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తూ.. అందరికీ తమ సినిమా చూడమని చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది మూవీ టీమ్. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా ‘యానిమల్’ను పెద్ద హిట్ చేయాలని తాజాగా హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్న మహేశ్ బాబు గురించి రణబీర్ కపూర్ చాలా స్వీట్‌గా మాట్లాడాడు అంటూ తన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంతే కాకుండా స్టేజ్‌పై మహేశ్ డైలాగ్ కూడా చెప్పాడు రణబీర్.


‘జై బాబు’..
ముందుగా ‘యానిమల్’ సినిమా గురించి చెప్పడానికి స్టేజ్‌పైకి వచ్చిన రణబీర్.. సినిమా క్యాస్ట్ అండ్ క్రూకు ధన్యవాదాలు తెలిపాడు. తను పనిచేసిన అందరు డైరెక్టర్స్‌లో సందీప్ చాలా స్పెషల్ అన్నాడు. తన సినిమాల్లో భాగం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక అనిల్ కపూర్.. తను సినిమాల్లోకి రాకముందే తనకు మాటిచ్చాడని, హీరో అయిన తర్వాత తన తండ్రి క్యారెక్టర్ చేస్తానని చెప్పాడని గుర్తుచేసుకున్నాడు. ‘యానిమల్’తో తన మాట నిలబెట్టుకున్నాడని అన్నాడు. బాబీ డియోల్‌ను తన సొంత అన్నలాగా భావిస్తానని తెలిపాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి చాలా మంచి వ్యక్తి అని, సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని అన్నాడు. అందరి గురించి చెప్పడం పూర్తయిన తర్వాత ‘జై బాబు’ అంటూ మహేశ్ బాబు గురించి చెప్పడం ప్రారంభించాడు  రణబీర్.


‘పోకిరి’ డైలాగ్‌తో ఇంప్రెస్..
‘‘నేను తెలుగులో కలిసిన మొదటిసారి సూపర్‌స్టార్ ఆయనే. నేను ఒక్కడు సినిమా చూశాను. చూసి ఆయనకు మెసేజ్ చేశాను. ఆయన రిప్లై కూడా ఇచ్చారు’’ అని గుర్తుచేసుకున్నాడు రణబీర్. ఆ తర్వాత ‘పోకిరి’ మూవీలోని మహేశ్ బాబు డైలాగ్‌ను తన ఫ్యాన్స్ కోసం వినిపించాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ తెలుగులో క్యూట్‌గా డైలాగ్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు మరోసారి రణబీర్‌కు ఫిదా అయిపోయారు. 


భార్యంటే భయం..
ఆ తర్వాత సుమ అడిగిన చిలిపి ప్రశ్నలకు సమధానాలిచ్చాడు రణబీర్. ట్రైలర్ ద్వారా తను ప్రేక్షకులను భయపెట్టాడని, తనను ఎక్కువగా భయపెట్టే విషయం ఏంటి అని అడిగితే భార్య అని జవాబు ఇచ్చాడు. ఇక ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో ఇప్పటికే ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, తెలుగులో కూడా ఆ మూవీ సూపర్ హిట్ అయ్యిందని గుర్తుచేస్తూ.. నేరుగా తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అంటూ ప్రశ్నించింది సుమ. వెంటనే సందీప్‌ను పిలిచి గుర్తుపెట్టుకోండి అని అన్నాడు రణబీర్. ఇక డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి.


Also Read: ‘యానిమల్‌’ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చేసింది: మహేశ్ బాబు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply