Namrata Shirodkar Thanks To Mahesh Babu Fans:  మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. మహేష్ అభిమానులు భారీగా తరలివచ్చారు.


మహేష్ అభిమానులకు నమ్రత కృతజ్ఞతలు


ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు, అభిమానులపై తన ప్రేమను బయటపెట్టుకున్నారు. అభిమానులే తనకు అన్నీ అన్నారు. “పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా ఆ అభిమానం పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.  ఈ సందర్భంగా అభిమానులందరికీ చేతులు పైకెత్తి దండం పెట్టారు. మహేష్ బాబుకు ఫ్యాన్స్ కూడా తిరిగి ఆయన మాదిరిగానే దండం పెట్టారు. ఈ ఫోటోలను మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఫ్యాన్స్ అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు రాబోయే వాటికి ఇది ప్రారంభం మాత్రమేనని తెలిపారు. గుంటూరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరి ప్రేమకు కృజ్ఞతలు తెలిపారు. ఈ ప్రేమ, అభిమానం ఇలాగే ఉండాలని ఆమె కోరకున్నారు.  






టార్గెట్ హ్యాట్రిక్ హిట్!


ఇక ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాతో మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పుడు 'గుంటూరు కారం' విడుదల కాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పులేని రీతిలో మహేష్ ను త్రివిక్రమ్ ఈ సినిమా చూపించబోతున్నారు.ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ తన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నారు. 


Read Also: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు