సుస్మితా సేన్ (Sushmita Sen) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగార్జున 'రక్షకుడు', అర్జున్ 'ఒకే ఒక్కడు', రామ్ గోపాల్ వర్మ 'మర్రిచెట్టు' సినిమాల్లో నటించారు. హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా, మాజీ మిస్ యూనివర్స్‌గానూ ఆవిడ పాపులర్. ఆవిడ పెళ్లి చేసుకోలేదు. కానీ, రిలేషన్షిప్స్‌లో ఉన్నారు. సుస్మితతో కొన్నాళ్ళు రిలేషన్షిప్‌లో ఉన్న వ్యక్తుల్లో లలిత్ మోడీ (Lalit Modi) ఒకరు. తమ మధ్య బ్రేకప్ ఎందుకు అయ్యింది? రీజన్ ఏమిటి? అనేది ఆయన వెల్లడించారు.

Continues below advertisement

లండన్‌లో ఆయన... ఇండియాలో ఆమె...దూరం ఎక్కువ కావడంతో బ్రేకప్ జరిగింది!'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కు ఇటీవల పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు లలిత్ మోడీ. అందులో తన బ్రేకప్ రీజన్ వెల్లడించారు. తాము విడిపోవడానికి ప్రధాన కారణం దూరం అని మోడీ వెల్లడించారు. సుస్మితా సేన్ తన యాక్టింగ్ కెరీర్, వృత్తిపరమైన బాధ్యతల వల్ల ఎక్కువగా మన దేశంలో ఉండవలసి రాగా... లండన్‌లో లలిత్ మోడీ స్థిరపడ్డారు. ఈ దూరం కారణంగా తమ బంధం ముందుకు సాగలేదని, అంటే తప్ప మరో కారణం లేదని ఆయన వివరించారు. అయినప్పటికీ... సుస్మితా సేన్ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని, తన వ్యక్తిత్వ వికాసంలో ఆమె పాత్ర ఉందని లలిత్ మోడీ గుర్తు చేసుకున్నారు.

Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

Continues below advertisement

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గర్ కాదు - లలిత్ మోడీLalit Modi On Sushmita Sen Trolls: రిలేషన్షిప్స్ పరంగా సుస్మితా సేన్‌ మీద సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆమెను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం సంబంధం పెట్టుకున్న వ్యక్తి) అని ఆరోపించారు. ఆ విమర్శలను లలిత్ మోడీ తీవ్రంగా తప్పు బట్టారు. లలిత్ మోడీ ఎంతో సంపన్నమైన మహిళ, తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ కలిసి బయటకు వెళ్ళిన ప్రతిసారీ సుస్మితాయే అన్ని ఖర్చులు భరించేదని, తాను ఆమెపై ఆధారపడిన బాయ్ ఫ్రెండ్ లా ఉండేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు లలిత్ మోడీ.

Also Read: Peddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

సుస్మితా సేన్ ఎవరి దగ్గరా ఏమీ ఆశించరని లలిత్ మోడీ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఆమెను గోల్డ్ డిగ్గర్ అంటే, తాను ఆమె దగ్గర ఉన్న వజ్రాలను చూసి వెళ్ళిన 'డైమండ్ డిగ్గర్' అవుతానని లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రమే కాదు... గతంలోనూ ఇటువంటి విమర్శలకు లలిత్ మోడీ ధీటుగా బదులు ఇచ్చారు. సుస్మితా సేన్‌కు వజ్రాలు అంటే ఇష్టమని, వాటిని స్వయంగా ఆవిడ కొనుక్కుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరు కుమార్తెలు (రెనీ, అలిసా)ను దత్తత తీసుకుని పెంచుతున్న ధీరవనితగా సుస్మితాను పేర్కొన్నారు లలిత్ మోడీ.

Also ReadPeddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?