Kiara Advani At Women In Cinema Gala: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు అవ్వడాన్ని గౌరవంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. ముఖ్యంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగే ఈవెంట్స్‌కు హాజరయ్యే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా మన ఇండియన్ హీరోయిన్లకు ఈ అవకాశం దక్కడం చాలా అరుదు. అలాంటిది యంగ్ బ్యూటీ కియారా అద్వానీ మాత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసిందట. ఇప్పటివరకు చాలా తక్కువమంది యంగ్ హీరోయిన్స్‌కు మాత్రమే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశం రాగా అందులో కియారా అద్వానీ పేరు కూడా యాడ్ అవ్వనుంది.


సినిమా గాలా డిన్నర్..


ఇప్పటివరకు దీపికా పదుకొనె, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ వంటి టాప్ స్టార్లతో పాటు సోనమ్ కపూర్, సారా అలీ ఖాన్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని స్పెషల్ ఈవెంట్స్‌కు హాజరయ్యారు. ఇక 2024లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించి రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహించే ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌కు అటెండ్ అయ్యే అవకాశం కియారాకు దక్కింది. వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్‌లో ప్రపంచ నలుమూలల నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆరుగురు మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గోనున్నారు. అంతే కాకుండా ప్రపంచంలోని సినిమా విశేషాలను పంచుకోవడానికి ఒక సమావేశం కూడా జరగనుందట.


ప్యానెల్‌లో కియారా..


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 2024 మే 18న లా ప్లేగ్ డేస్ పాల్మ్స్‌లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌ ఏర్పాటు కానుంది. ఇందులో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన సినీ సెలబ్రిటీలు.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఈ ప్యానెల్‌లో కియారా అద్వానీ కూడా భాగంకానుంది. ఈ ఏడాది ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ కూడా లారియల్ బ్రాండ్‌కు సంబంధించిన కొత్త అంబాసిడర్స్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గోనున్నారు. ఐశ్వర్య రాయ్.. కేన్స్ ఫెస్టివల్‌కు రెగ్యులర్ అయినా అదితి మాత్రం 2022లో మొదటిసారి ఈ రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఈ ఏడాది ‘హీరామండి’ లాంటి బ్లాక్‌బస్టర్ రిలీజ్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే ట్రెండింగ్‌లో కనిపిస్తోంది.


భారత్ పర్వ్..


మే 14 నుండి 25 మధ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ జరగనుంది. అందులో పలువురు ఇండియన్ సినీ సెలబ్రిటీలు కలిసి ‘భారత్ పర్వ్’ అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందని ఇందులో చూపించనున్నారు. సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గోనున్నారు. భారత్ పర్వ్ లాంటి ఈవెంట్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరగడం ఇదే మొదటిసారి అని ఇండస్ట్రీ నిపుణులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ ఏడాది జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ సెలబ్రిటీలు హైలెట్ అవ్వనున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదు, పెళ్లిలో సర్దుకుపోవడం కామన్ - జ్యోతిక