సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో లేటెస్టుగా ట్రోలింగ్‌కు బలవుతోన్న హిందీ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Trolled on Twitter). రీసెంట్‌గా కొత్త పెళ్లి కూతురు ఆలియా భట్‌పై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెళ్లి తర్వాత నుదుట సింధూరం పెట్టుకోలేదని ట్రోల్ చేశారు. కరీనాపై వస్తున్న ట్రోల్స్‌కు కారణం కూడా సింధూరమే. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. 


కరీనా వివాహమై చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు బొట్టు ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారంటే... దానికి జ్యువెలరీ యాడ్ కారణం. వాణిజ్య ప్రకటనపై వ్యతిరేకత, వేడి కరీనాకూ తగులుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...


మలబార్ గోల్డ్ (Malabar Gold) సంస్థకు కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్. అక్షయ తృతీయ సందర్భంగా ఒక యాడ్ ఇచ్చింది. అందులో కరీనా కపూర్ నుదుట బొట్టు లేదు. ఇది చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. 'బొట్టు లేకపోతే బిజినెస్ లేదు' (#No_Bindi_No_Business), 'బాయ్ కాట్ మలబార్ గోల్డ్ (#Boycott_MalabarGold) అంటూ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.


Also Read: సమంత వార్నింగ్ ఎవరికి? కాజల్ డెలివరీకి, వార్నింగ్‌కు లింక్ ఉందా?


కరీనా నుదుట బొట్టు లేకుండా యాడ్ ఇవ్వడం హిందువులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు కరీనా కపూర్ మీద కూడా విమర్శలు మొదలుపెట్టారు.  


Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?