'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి:
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు. రేపు టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. చివరి షెడ్యూల్ లో ఓ పాటను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.





 


'ఆచార్య' లాహే సాంగ్ ప్రోమో:
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమాలో 'లాహే లాహే' సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.