సమంత, నయన తార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కాతు వాక్కులా రెండు కాదల్'. తెలుగులో ఈ చిత్రాన్ని 'కణ్మణీ రాంబో ఖతీజా' టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతో వినోదాత్మకంగా ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'టూ టుటు టుటూ' అనే సాంగ్ విడుదలైంది. 

 

ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడే హీరో, వారి మధ్య సాగే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. 'ఖుషి'లో దీపం సీన్ తో ఈ సినిమా ట్రైలర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత సమంత, నయనతార ఇద్దరూ కూడా ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తుంది. అతడే మన హీరో విజయ్ సేతుపతి. అతడు కూడా ఈ ఇద్దరినీ ఎంతగానో ఇష్టపడతాడు. 

 

అదే విషయాన్ని ఇద్దరికీ చెప్పినప్పుడు సమంత, నయనతార చెరొక చెంపదెబ్బ కొడతారు. ట్రైలర్ లో సన్నివేశాలన్నీ చాలా కామెడీగా ఉన్నాయి. ట్రైలర్ తోనే ఫన్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు దర్శకుడు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు.