Emergency Gets Censor Certificate: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ చిక్కుల నుంచి బయట పడింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్క్రీనింగ్ కోసం క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ’ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని తెలిపింది. త్వరలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. ఈ సినిమా విషయంలో అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వస్తున్న మద్దతు పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపింది. “మా సినిమా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ సపోర్టుకు ధన్యవాదాలు” అని ఎక్స్ లో వెల్లడించింది.  


సిక్కు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత


‘ఎమర్జెన్సీ’ సినిమా సెప్టెంబర్ 6న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, ఈ చిత్రం సిక్కు సమాజాన్ని చెడుగా చూపించేలా ఉందని ఆరోపిస్తూ సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగాయి. పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయలేదు. చిత్ర బృందం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు  రివైజింగ్ కమిటీ సూచించిన విధంగా కీలక మార్పులు చేర్పులు చేస్తామని నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమాకు క్లియరెన్స్ లభించింది.


13 కట్స్ తో U/A సర్టిఫికేట్‌


‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 13 కట్స్ సూచించింది. సినిమాలో కొన్ని మార్పులు చేయాలని చెప్పింది. రివైజింగ్ కమిటీ మార్పులకు అనుగుణంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ కు సూచించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ ను జారీ చేసింది. పలు హింసాత్మక సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాను తొలగించినట్లు తెలుస్తోంది. 13 కట్స్ అంటే సినిమాలో చాలా కీలక సన్నివేశాలను లేపేసి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.



పంజాబ్ ఎన్నికల తర్వాతే విడుదల?


‘ఎమర్జెన్సీ’ సినిమాను పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. "CBFC సర్టిఫికేట్ జారీ అయిన నేపథ్యంలో... ఈ సినిమాను పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో బయట జరుగుతున్నట్లు ఓ వర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఏవీ ఉండవు. ప్రేక్షకులు తప్పకుండా చూడాలి. ఈ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీయదు. పంజాబ్ ఎన్నికల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తే ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవని భావిస్తున్నాం” అని మేకర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. 


‘ఎమర్జెన్సీ’ కథ ఏంటంటే?


ఈ సినిమాను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించింది కంగనా. జూన్ 1975 నుంచి మార్చి 1977 వరకు ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ముఖ్య ఘటనల ఆధారంగా తెరకెక్కింది. కంగనా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా పాత్రలోనూ నటించింది.  ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషించారు.


Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే