టాలీవుడ్​లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇంకా కుర్రాడిలా అదే అందం, అదే ఫిజిక్​ని మైంటైన్ చేస్తున్నాడు. ఇక ఈమధ్య జిమ్​లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన వర్కౌట్స్​కు సంబంధించిన పిక్స్​ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్​ని ఖుషీ చేస్తున్న మహేష్.. తాజాగా మరోసారి జిమ్​లో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన పిక్చర్​ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్​లో మహేష్ ఓ రేంజ్​లో కండలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ బాండ్​లాగా తన బాడీని బిల్డ్ చేసుకునేందుకు మహేష్ జిమ్​లో భారీ కసరత్తులు చేస్తున్నాడు.


తాజాగా షేర్ చేసిన పిక్​లో మహేష్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తూ కనిపించారు. ఆ పిక్​లో మహేష్ బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. ఈ పిక్​ని షేర్ చేస్తూ.. "హార్డ్ వర్క్ విషయానికి వస్తే నలుపు తెలుపు అంటూ ఏమీ ఉందడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే"అంటూ  రాసుకొచ్చాడు. హాలీవుడ్​కు చెందిన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హీత్ మాథ్యూస్​ను మహేష్ తన ఫిట్నెస్ ట్రైనర్​గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అతని ఆధ్వర్యంలోనే మహేష్ వర్కౌట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం మహేష్ న్యూ  పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు మహేష్​ని 'జేమ్స్ బాండ్' అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.


మరి కొంతమంది 'రాజమౌళి సినిమా కోసమే మహేష్ అన్న భారీగా కండలు పెంచుతున్నాడని, జక్కన్న మహేష్​ని జేమ్స్ బాండ్​లా చూపించబోతున్నడంటూ' చెబుతున్నారు. ఇప్పటివరకు మహేష్ ఏ సినిమాలోనూ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించలేదు. గతంలో సుకుమార్ తెరకెక్కించిన 'వన్ నేనొక్కడినే' మూవీ సమయంలో మహేష్ సిక్స్ ప్యాక్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ సమయంలో తన ముఖంలో తెలియని మార్పులు రావడంతో మధ్యలోనే ఆపేసాడు. కానీ ఈసారి రాజమౌళి సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ ట్రైనర్ నియమించుకొని మరి సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేస్తున్నాడు.


ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేష్ జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లన్నారు మహేష్. తాజాగా మహేష్ సినిమాకు సంబంధించి రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేశారు. నవంబర్ లో ఈ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.


Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్న 'స్కంద' - స్ట్రీమింగ్ డేట్ ఇదే!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial