ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) లండన్ లో ఉన్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్, ఇద్దరు పిల్లలు తైమూర్, జెహ్ అలీ ఖాన్ తో కలిసి విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ నుంచి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది.


ఇటీవల కరీనా కపూర్ ఖాన్ ఒక ఫోటో పోస్ట్ చేశారు. యమ్మీ యమ్మీ ఫుడ్ తినడంతో ఆమె టమ్మీ కొంచెం పైకి అచ్చింది. అది చూసిన చాలా మంది ఆమె మళ్ళీ తల్లి కాబోతుందని అనుకున్నారు. మూడోసారి కరీనా గర్భం దాల్చారని నెటిజన్లు ఏవేవో రాసుకొచ్చారు. బేబీ బంప్ కనపడకుండా చేయాలని కరీనా తెగ తాపత్రయ పడుతున్నారని కామెంట్స్ చేశారు. దాంతో కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. అది బేబీ బంప్ కాదని, తాను ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ ఇచ్చారు.


''నేను ప్రెగ్నెంట్ కాదు... శాంతించండి! పాస్తా తినడం, వైన్ తాగడం వల్ల మీకు అలా కనిపించింది. మన దేశ జనాభా పెంచడానికి చాలా కంట్రిబ్యూట్ చేశానని సైఫ్ చెప్పారు. ఎంజాయ్ చేయండి. ఇట్లు, KKK (కరీనా కపూర్ ఖాన్)'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. అదీ సంగతి!


Also Read : ఆ కీర్తనతో వివాదంలో చిక్కుకున్న శ్రావణ భార్గవి, అవమానం జరిగిందంటున్న అన్నమయ్య వంశస్థులు



ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ నలుగురు పిల్లలకు తండ్రి. మొదటి భార్య అమృత ద్వారా ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీంకు ఆయన తండ్రి అయ్యారు.  


Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?