Allu Arjun Next Movie With Direcor Nelson: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. గత మూడేళ్లుగా బన్నీ పుష్ప సీక్వెల్స్‌తోనే ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఏడాది ఒకటి, రెండు సినిమాలు చేసే బన్నీ మూడేళ్లుగా ఒకే ప్రాజెక్ట్‌పై ఉన్నాడు. దీంతో అతడి నెక్ట్స్‌ సినిమా ఏంటనేది ఆసక్తి నెలకొంఆది. పుష్ప పార్ట్‌ వన్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. మరి బన్నీ నెక్ట్స్‌ సినిమాల లైనప్‌ ఏంటీ, ఎలాంటి జానర్‌లో వస్తున్నాడా అని ఫ్యాన్స్‌ క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కథలు వింటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సందీప్‌ రెడ్డి వంగా, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీలతో సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ మధ్య 'యానిమల్‌' డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి ఉన్న ఫోటో కూడా రిలీజ్‌ చేశారు. ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా ఉండనుందనేది స్పష్టమైంది . కానీ అదే ఏ జానర్‌, కథేంటి అనేది ఏం క్లారిటీ లేదు. పుష్ప 2 అయిపోగానే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం ఉంది. అది కన్‌ఫాం. ఇక అట్లీతో సినిమా క్యాన్సల్‌ అయినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇది బయటకు రావడంతో అభిమానుల్లో కాస్తా టెన్షన్‌ మొదలైంది. అట్లీతో బన్నీ సినిమా అనగానే ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. అంతలోనే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే వార్త బయటకు రావడంతో డిసప్పాయింట్‌ అయ్యారు.


ఇక అట్లీ ఇలా అవుట్‌ అయ్యాడో లేదో.. బన్నీని తాజాగా మరో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కలిశారట. ఆయనే 'జైలర్‌' ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. తాజాగా నెల్సన్‌ బన్నీ కలిసి కథ వినిపించినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథకు బన్నీ ఒకే చెప్పాల్సి ఉందట. అంతా ఒకే అయితే నెల్సన్‌తో బన్నీ మూవీ ఫైనల్‌ అయినట్టే అని తెలుస్తోంది. అట్లీ అవుట్‌ అయినా మరో స్టార్‌ డైరెక్టర్‌ లైన్లో రావడంతో అల్లు ఫ్యాన్స్‌ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా ఉండేలా కనిపించడం లేదు. కాగా.. 'పుష్ఫ 2' తర్వాత అల్లు అర్జున్‌ని ఏ డైరెక్టర్‌ని లైన్‌లో పెడతాడా? అనేది ఆసక్తి నెలకొంది. చూస్తుంటే పుష్ప 2 అయిపోయాగానే ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమాని పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్క్రిప్ట్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడీ తర్వాత  మూవీ సెట్స్‌పైకి తీసుకురావాల్సి ఉంది.



ఆ తర్వాతే అల్లు అర్జున్‌తో సినిమా స్టార్ట్‌ చేసే ఆలోచన సందీప్‌ ఉన్నాడట. అందుకే పుష్ప 2 అయిపోయిన వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్‌ చేసేందుకు బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడట. పుష్ఫ 2 రిలీజ్‌ తర్వాత కాస్తా గ్యాప్‌ తీసుకుని 2025 మేలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట.  గురూజీ  ఈ సినిమాను 'కల్కి 2898 ఏడీ' స్టైల్లో ప్లాన్ చేసినట్టు టాక్. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్‌ జానర్‌ని టచ్ చేశాడట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ అండ్‌ టీం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 


Also Read: జూనియర్ ఎన్‌టీఆరే టాప్, అతడి తర్వాతే ఆ హీరోలు - కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు