టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ ఈ ఫిబ్రవరి 16కి 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. గతంలో ఈ కాంబోలో 'టైగర్‌' మూవీ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్‌, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన అందుకున్నాయి.


ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ మైఖేల్ సినిమా రిజల్ట్ పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


'మైఖేల్' సినిమా నాకే నచ్చలేదు


మైఖేల్ రిజల్ట్ గురించి సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." అవును నిజమే.. 'మైఖేల్' సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది. కానీ ఎక్కడో దాని గురించి మిస్టేక్ జరిగింది. మైకేల్ మూవీ ని ముగ్గురు నిర్మాతలు నిర్మించారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇద్దరు నిర్మాతలు అన్నారు. కానీ ఓ నిర్మాత రిలీజ్ కి సరిగ్గా 12 రోజుల ముందు సినిమా సరిగ్గా రాలేదని అన్నారు. అప్పుడు విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో నేను మళ్ళీ అవుట్ ఫుట్‌ను రీ చెక్ చేయలేదు. ఎందుకంటే సరిగ్గా రిలీజ్ టైంలో అలాంటి ఒత్తిడిని నేను ఎదుర్కోవాలనుకోలేదు. రిలీజ్ కు ఒక్క రోజు ముందు సినిమా చూసినప్పుడు సినిమా బాలేదని నాకు అర్థమైంది" అని అన్నారు.


టెక్నికల్ పరంగా 'మైఖేల్' ఫెంటాస్టిక్ ఫిల్మ్


"మైఖేల్ కి సంబంధించి మొదట్లో కొన్ని ఎపిసోడ్స్ చూసి కచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని భావించాను. అయితే సినిమా మొత్తం చూసినప్పుడు ఈ ఎపిసోడ్స్ మాత్రమే కాదు కథ మొత్తం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూడాలి. టెక్నికల్ పరంగా మైఖేల్ ఒక ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. మేం కూడా సినిమాపై సాలిడ్ టెక్నికల్ ఎఫెక్ట్స్ పెట్టాం. అదే సమయంలో కథ పై కాన్సెంట్రేట్ చేయలేదు. మేము అనుకున్న కథ ఆడియన్స్ కి చెప్పలేకపోయాం. మైఖేల్ మూవీ విషయంలో నాకు కష్టంగా అనిపించింది. ఎందుకంటే రిజల్ట్ నాకు ముందే తెలుసు కాబట్టి" అంటూ  చెప్పుకొచ్చారు. మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్షా బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు. హాస్య మూవీస్ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అనిల్ సుంకర రాజేష్ దండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.


Also Read : సాంగ్‌లా లేదు, షాంపూ యాడ్‌లా ఉంది - ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్‌పై ట్రోల్స్