బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్ లో ఒకరైన రణవీర్ సింగ్ - దీపికా పదుకొనె జంటకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను తమ రొమాన్స్ తో ఫ్యాన్స్ ని, నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నారు ఈ జంట. సోషల్ మీడియాలో వీళ్ళ ఆఫ్ స్క్రీన్ ఫోటోలు, వీడియోలకి విపరీతమైన లైక్స్ వస్తూ ఉంటాయి. కాగా ఇప్పటికే ఈ జంట సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై ఒకరు రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్స్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా మరోసారి దీపికా పదుకొనే తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ కి రణవీర్ సింగ్ కపూర్ రియాక్ట్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దీపికా పదుకొనే తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ కోట్ ను షేర్ చేసింది.


కోట్ లో పేర్కొంటూ.." మీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోండి. ఈ విషయాన్ని నేను తేలిగ్గా చెప్పడం లేదు. మీరు ప్రేమలో పడే వ్యక్తిలో నిజమైన, బలమైన, సంతోషకరమైన స్నేహాన్ని కనుగొనండి. మీ గురించి గొప్పగా మాట్లాడే వ్యక్తి, మిమ్మల్ని నవ్వించగల వ్యక్తి. జీవితం చాలా చిన్నది. మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను అసలు ప్రేమించకండి. వారు మిమ్మల్ని కూడా ఏడిపించే వాళ్ళని తెలుసుకోండి. అలాంటి సమయంలో ఎవరితో అయితే ఉండాలనుకుంటున్నారో వారిని వెతుక్కోండి. మరీ ముఖ్యంగా  మీ అభిరుచులను ఇష్టపడే మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోండి. ఆ ప్రేమ ఎప్పటికీ పలుచబడదు" అని తన ఇన్స్టా పోస్టులో పేర్కొంది దీపిక పదుకొనే. స్పెషల్ పోస్టుకి తన భర్త రణవీర్ సింగ్ ను సైతం ట్యాగ్ చేసింది. తన భార్య ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చేసిన ఈ స్పెషల్ పోస్ట్ పై రణవీర్ సింగ్ రియాక్ట్ అవుతూ.. కామెంట్ సెక్షన్లో హార్ట్ , ఇన్ఫినిటీ సింబల్స్ ని పోస్ట్ చేశాడు.






కాగా రణబీర్ సింగ్ కపూర్, దీపికా పదుకొనే సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన 'రామ్ లీలా' సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. 2013లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రణవీర్, దీపిక ప్రేమలో పడ్డారు. సుమారు ఆరు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న ఈ జంట 2018 ఇటలీలో చేసుకున్నారు. రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.


ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలో రణవీర్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దీపికా పదుకొనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో 'కల్కి 2898AD' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలో గెస్ట్ రోల్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.


Also Read : ‘కథాకేళి’ టీజర్ రిలీజ్: ‘శతమానం భవతి’ దర్శకుడు కొత్త ప్రయత్నం






Join Us on Telegram: https://t.me/abpdesamofficial