Adipurush: ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు(జూన్ 16) గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిన్నటి నుంచే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. కొన్ని ఏరియాల్లో తెల్లవారుజాము నుంచే షో లు మొదలైపోయాయి. రామాయణ దృశ్య కావ్యాన్ని ఇప్పటి విజువల్ ఎఫెక్ట్స్ తో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమా విడుదల అయిన అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. రామాయణం నాటకం ఎక్కడ జరిగినా హనుమంతుడు వచ్చి చూస్తాడనే నమ్మకంతో మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఓ థియేటర్ లోకి నిజంగానే ఓ వానరం ‘ఆదిపురుష్’ సినిమా చూడటానికి వచ్చింది. ఆ సన్నివేశాన్ని థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


‘ఆదిపురుష్’ థియేటర్ లోకి వానరం-జై శ్రీరామ్ అంటూ నినాదాలు ప్రేక్షకులు..






‘ఆదిపురుష్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా చూసేందుకు ప్రేక్షకులు నిన్నటి నుంచే థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. మొదటి రోజు కొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచే షో లు మొదలైయ్యాయి. ఏ థియేటర్ లో చూసినా ప్రేక్షకులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. హనుమంతుడి కోసం ప్రతీ థియేటర్లో ఒక సీటు వదిలేశారు. అయితే ‘ఆదిపురుష్’ సినిమా రన్ అవుతుండగా ఓ వానరం థియేటర్ లోకి వచ్చింది. కాసేపు సినిమాను చూసి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు ఆ వానరాన్ని చూసి జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాక్ష్యాత్తూ హనుమంతుడే రామయణాన్ని చూడటానికి వచ్చాడు అంటూ ఆ వానరానికి చేతులెత్తి మొక్కారు. ఇదంతా థియేటర్ లోని ప్రేక్షకులు వీడియో తీశారు. వానరం కనిపించినంతసేపు ఆ థియేటర్ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్స్ కూడా స్పందిస్తూ జైశ్రీరామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


థియేటర్లలో హనుమాన్ విగ్రహం, పూజలు..










‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టికెట్ ల విక్రయాల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ కోసం ఉంచిన సీటు గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ను ఉంచాలని భావించారు. అలాగే కొన్ని చోట్ల ఖాలీ సీట్లలో హనుమాన్ ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచుతున్నారు. అంతే కాదు పూలతో హనుమంతునికి పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా థియేటర్ లోకి వానరం రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే రామాయణం ఎక్కడ జరిగినా అక్కడకు హనుమ వస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ లోకి వానరం రావడం, సినిమా చూడటం ఆశ్చర్యం కలిగించే విషయమనే చెప్పాలి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


Also Read: 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?