ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ కె' (Project K Movie Latest Update). ఇందులో బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో కొన్ని స్పెషల్ వెహికల్స్ ఉన్నాయి. మహీంద్రా రీసెర్చ్ సెంటర్ లో వాటిని తయారు చేయించే పనులు జరుగుతున్నాయి.


'ప్రాజెక్ట్ కె' కోసం కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ సాయం కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... మహీంద్రా రీసెర్చ్ వాలీకి నాగ్ అశ్విన్ వెళ్ళారు. 'ప్రాజెక్ట్ కె'కి అవసరమైన వెహికల్స్ గురించి అక్కడ టీమ్ సభ్యులతో డిస్కస్ చేశారు. మహీంద్రా క్యాంపస్ విజిట్ చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రాకు థాంక్స్ చెబుతూ నాగ్ అశ్విన్ ఒక ట్వీట్ చేశారు. దానికి రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా, హాలీవుడ్ ను బీట్ చేస్తారని ప్రశంసించారు.






"నాగ్ అశ్విన్... మీరు క్రియేట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె'తో నన్ను ఎగ్జైట్ చేశారు. మీరు హాలీవుడ్ ను బీట్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 'ప్రాజెక్ట్ కె'ను వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. 

Also Read: ప్రభాస్‌తో మారుతి మసాలా ఎంట‌ర్‌టైన‌ర్, మరిన్ని డీటెయిల్స్ ఇవిగో!


Also Read: Radhe Shyam First Weekend collections: 'రాధే శ్యామ్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, నిర్మాతలు సేఫ్!