Bhairavam Official Teaser : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తెలుగులో  సినిమాలు చేసి చాలా కాలమే అవుతుంది. అందుకే గ్యాప్ ఇచ్చి వచ్చినా.. గట్టిగా హిట్ కొట్టాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే భైరవం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే టీజర్​ని విడుదల చేసింది చిత్రబృందం. ఒక్క టీజర్​తో భైరవం సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు డైరక్టర్. నారా రోహిత్, మంచు మనోజ్​తో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన చేసిన యాక్షన్ మామూలుగా లేదు. గరుడన్ మూవీ రీమేక్​గా వస్తోన్న ఈ సినిమా టీజర్ ఎలా సాగిందంటే.. 


టీజర్ హైలైట్స్..


జయసుధ అందించిన వాయిస్ ఓవర్​తో టీజర్​ను ప్రారంభించారు. ''రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగి పడిన తలలు.. మొండాలు. దూరంగా మృత్యువు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్లిపోతున్నాడురా శ్రీను'' అంటూ వాయిస్ ఓవర్​ వస్తుంది. అనంతరం ఒక్కో క్యారెక్టర్​ని పరిచయం చేస్తూ టీజర్​ను చూపించారు. '' ఈ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మవారు ఆ అమ్మ గుడిని కాపాడడానికి నానమ్మ ఉండగా మాకేమవుతుందంటూ'' .. నారా రోహిత్ డైలాగ్ చెప్పిన విధానం బాగుంది.


'' శ్రీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా.. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడకా ప్రాణాలు తీస్తా''  అంటూ మంచు మనోజ్​ చెప్పిన డైలాగ్ టీజర్​కే హైలైట్​గా నిలిచింది. '' ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామ లక్ష్మణులకు ఏమి కాకుండా చూసుకోవడానికి ఈ శ్రీనుగాడు ఉన్నాడు''  అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగ్​తో టీజర్​ను ముగించారు. మాస్ డైలాగ్స్​తో పవర్​ ఫుల్​గా సాగింది టీజర్. 


గరుడన్​కి రీమేక్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్​లో​ ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి.. తెలుగులో విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా విడుదలపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా పూర్తైనట్లు.. చాలా బాగా వచ్చిందని.. బెల్లంకొండ శ్రీను నటన అద్భుతమని.. మనందరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు మంచు మనోజ్​ టీజర్​ లాంచ్​లో తెలిపారు. 


సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురు ప్రధాన హీరోలుగా చేస్తున్నారు. ఈ మూవీ ముగ్గురికి కీలకంగా మారనుంది. ఎందుకంటే వీరికి హిట్ వచ్చి చాలాకాలమే అయింది. ఇప్పుడు ఈ సినిమాతో హిట్​ కొట్టాలని ఈ హీరోలు ఎదురు చూస్తున్నారు. హీరోలకు తగ్గట్లుగా నటీనటులను ఎంచుకున్నాడు డైరక్టర్. జయసుధ, డైరక్టర్ సందీప్ రాజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 



Also Read : ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడిగా బాలీవుడ్ హీరో.. కన్నప్ప మూవీ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్​ రిలీజ్