కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మార్మోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan)తో ఈ డైరెక్టర్ తెరకెక్కించిన 'జవాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్  ని సైతం విపరీతగా ఆకట్టుకుంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'జవాన్' కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు సమాచారం. 'జవాన్' లో షారుక్ ని చూపించిన విధానానికి బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు సినీ క్రిటిక్స్ సైతం ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు అట్లీతో సినిమాలు చేసేందుకు మరి కొంతమంది బాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ యంగ్ హీరో అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ లో డిఫరెంట్ జానర్ మూవీస్ తో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్లో విభిన్న తరహా కథలను ఎంచుకొని వాటితో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. 'విక్కీ డోనర్' 'బదాయి హో', 'శుభ్ మంగల్ సావ్ ధాన్', 'బాలా', 'డ్రీమ్ గర్ల్' 'అంధాదున్' వంటి డిఫరెంట్ జానర్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయుష్మాన్ 'సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తనకు వర్క్ చేయాలని ఉందని, ముఖ్యంగా సౌత్ డైరెక్టర్ అట్లీ, మలయాళ స్టార్ ఫాహాద్ ఫజిల్ వంటి వారితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు' తెలియజేశాడు.


"నాకు ఎప్పుడూ డిఫరెంట్ స్క్రిప్స్ అండ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకొని సినిమాలు చేయాలని కోరిక ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ సబ్జక్ట్స్ సౌత్ నుండి కూడా వస్తున్నాయి. మేము వాళ్ళ కంటెంట్ ని ఎప్పటినుంచో రీమేక్ చేస్తున్నాం. కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ ని ఎంచుకొని సినిమా చేసే హీరోగా సౌత్ ఆడియన్స్ కి నాపట్ల కొంత గౌరవం ఉంటుంది. కెరీర్ పరంగా ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా సినిమాలు చూసి గర్వపడుతున్నాను" అని తెలిపాడు ఆయుష్మాన్ (Ayushman Khurana). అంతే కాకుండా... "నేను అట్లీ, ఫహాద్ ఫజిల్ లాంటి వాళ్లతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్లు ఎంచుకునే సబ్జెక్ట్స్ కాస్త వేరుగా ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు.


దీంతో ఈ బాలీవుడ్ హీరో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా 'డ్రీమ్ గర్ల్ 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆయుష్మాన్ ఖురానా. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ పై ఏక్తా కపూర్, శోభ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని రాజ్ శాండిల్య డైరెక్ట్ చేశారు.


Also Read : శ్రీలీల చేతుల మీదుగా విడుదలైన 'కోట బొమ్మాళి' ఫోక్ సాంగ్ - మీరు విన్నారా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial