ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు అంకితం అయ్యారని చెప్పలేం. కానీ, ప్రస్తుతానికి ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని మాత్రం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి రాజకీయ బాధ్యతల కోసం అటు వైపు ఎక్కువ ఉన్నారు. ఆ మధ్య రాజకీయ సమావేశంలో 'ఓజీ చూద్దరు. బావుంటుంది' అని చెప్పారు. అయితే... మళ్లీ మేకప్ వేసుకునేది ఎప్పుడు? షూటింగ్స్ చేసేది ఎప్పుడు? అనేది మాత్రం చెప్పలేదు. పవన్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తున్న అభిమానులకు అనసూయ అదిరిపోయే న్యూస్ చెప్పారు. అది ఏమిటంటే?


పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ చేశా - అనసూయ
Anasuya Bharadwaj dances with Pawan Kalyan in a special song for his upcoming film: ప్రజెంట్ 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' షోలో అనసూయ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో చూపించి ఎవరో గెస్ చేయమని అడిగారు. అప్పుడు అందరూ పవన్ అని చెప్పారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పారు అనసూయ. 


''తొలిసారి ఓ టెలివిజన్ షోలో ఈ విషయం చెబుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నంబర్ చేశానని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పాట మాత్రం మన టీవీల్లో మోత మోగిపోద్ది'' అని అనసూయ చెప్పారు. ఇంతకీ, ఆ సినిమా ఏదో తెలుసా?


Also Read: 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ లీక్ కానివ్వను - మెగా అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్






'హరి హర వీర మల్లు'లో అనసూయ స్పెషల్ సాంగ్!
Anasuya Special Song In Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీర మల్లు' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ మూడు సినిమాల్లో అనసూయ స్పెషల్ సాంగ్ చేసినది వీరమల్లులో అని ఫిల్మ్ నగర్ నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


Also Readహను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?



మొఘల్ వంశస్థులు భారతదేశాన్ని పాలించిన కాలం నేపథ్యంలో 'హరి హర వీర మల్లు' తెరకెక్కుతోంది. ఆ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చిన ఓ బాణీకి పవన్, అనసూయ స్టెప్స్ వేశారని తెలిసింది.



Hari Hara Veera Mallu Cast And Crew: 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలు కాగా... ఇప్పుడు మిగతా భాగాన్ని రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా... బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాశారు.