ప్రభాస్ (Prabhas) ప్రేమలో ఉన్నారా? 'ఆదిపురుష్'లో తనకు జోడీగా నటించిన కృతి సనన్ (Kriti Sanon) తో ఆయన డేటింగ్ చేస్తున్నారా? ఆ మధ్య హిందీ హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం చెలరేగింది. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణం అయ్యాయి. ఆ తర్వాత అందులో నిజం లేదని కృతి సనన్ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి.


ప్రభాస్‌కు ఫోన్ చేస్తే...
వరుణ్ ధావన్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలా ఇబ్బందులు పడ్డానని కృతి సనన్ తెలిపారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరోసారి అప్పట్లో జరిగిన విషయాలపై మరోసారి ఆమె స్పందించారు.


''ప్రభాస్, నేను ప్రేమలో పడ్డామని వార్తలు రావడానికి కారణం వరుణ్ ధావన్. మేం ఇద్దరం అప్పటికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం. వరుణ్ ధావన్‌కు బోర్ కొట్టింది. ఏదైనా రూమర్ క్రియేట్ చేద్దామన్నాడు. నా జీవితంలో ఎవరో ఉన్నారని చెబుతానని అన్నాడు. సరే అన్నాను. కానీ, ప్రభాస్ పేరు చెబుతాడని నాకు అసలు తెలియదు. ఆ తర్వాత గోల గోల అయ్యింది. దాని గురించి నేను ప్రభాస్‌కు ఫోన్ చేశా. జరిగిందంతా చెప్పాను. 'వరుణ్ ధావన్ ఎందుకు అలా అన్నాడు?' అని ప్రభాస్ క్వశ్చన్ చేశాడు. వరుణ్ పిచ్చిగా మాట్లాడానని చెప్పేశా. ఆ తర్వాత నాకు తెలిసిన చాలా మంది 'పెళ్లి ఎప్పుడు' అని ప్రశ్నించారు. బోలెడు మెసేజ్ లు వచ్చాయి. దాంతో స్పందించక తప్పలేదు'' అని కృతి పేర్కొన్నారు.


'అన్‌స్టాపబుల్'లో కృతితో ప్రేమ, పెళ్లి గురించి ప్రభాస్‌ను బాలకృష్ణ అడిగారు. ఆ విషయంలో ఏమీ లేదని మేడమ్ చెప్పారని రెబల్ స్టార్ బదులు ఇచ్చారు. వరుణ్ ధావన్ కామెంట్ పక్కన పెడితే... అయోధ్యలో 'ఆదిపురుష్' (Adipurush) టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. అక్కడ ప్రభాస్ చెమట తుడుచుకోవడానికి ట్రై చేస్తే కృతి సనన్ తన చీర కొంగు అందించడం... ప్రభాస్ నడుస్తుంటే అతనికి కృతి సపోర్ట్ ఇవ్వడం వంటివి వైరల్ అయ్యాయి. అందువల్ల ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని కొందరు బలంగా నమ్మారు.


Also Read హీరోగా కాదు అభిమానిగా ఆస్కార్స్‌కు రామ్ చరణ్ - అక్కడ వాళ్ళిద్దర్నీ చూడాలని... 


ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ గురించి జరుగుతున్న ప్రచారానికి తోడు తనను తాను క్రిటిక్ అని సోషల్ మీడియాలో ప్రకటించుకున్న ఉమైర్ సందు చేసిన లేటెస్ట్ ట్వీట్ మరింత వైరల్ అయ్యింది. వచ్చే వారం మాల్దీవుల్లో వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకోవడానికి రెడీ అయ్యారని ట్వీట్ చేశాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ ట్వీట్ గురించి డిస్కషన్. దాంతో ప్రభాస్ టీమ్ రియాక్ట్ అవ్వక తప్పలేదు. అది కూడా పుకారే అని ప్రభాస్ టీమ్ పేర్కొంది.
 
ప్రేమ లేదు... పీఆర్ కాదు!  
వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్ అయిన తర్వాత కృతి సనన్ స్పందించారు. ''ఇది ప్రేమ కాదు... పీఆర్ (పబ్లిసిటీ స్టంట్) అంత కంటే కాదు'' అని ఆమె పేర్కొన్నారు.  అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారామె. ''మా తోడేలు (వరుణ్ ధావన్) రియాలిటీ షోలో కొంచెం హద్దులు దాటింది. సరదాగా చేసిన వ్యాఖ్యలు పుకార్లకు కారణం అయ్యాయి. ఎవరో ఒకరు నా పెళ్లి తేదీ వెల్లడించే ముందు నన్ను అసలు విషయం చెప్పనివ్వండి. అదంతా ఫేక్ న్యూస్'' అని కృతి పేర్కొన్నారు. హిందీలో భారీ సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉన్నట్టు ప్రచారం చేయడం పబ్లిసిటీ స్టంట్ అని చెబుతుంటారు. అందులోనూ ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు కావడంతో కృతితో ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థానికి రెడీ అయ్యారని వార్తలు రాగానే ప్రేక్షకుల అందరి దృష్టి వాళ్ళ మీద పడింది. 


Also Read వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం