టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ పాల్గొన్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని లావణ్య అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాజ్ తరుణ్ ను కలవాలని గేటు దగ్గర గొడవ చేసింది. అయితే, ఆమెను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. “నా మొగుడు రాజ్ తరుణ్ తో హీరోయిన్ ఎలా సహజీనం చేస్తుంది? అతడు తప్పు చేయకుంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు?” అంటూ గొడవ చేసింది. అయితే, ఆమెను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. అయినా, ఆమె అక్కడి నుంచి వెళ్లకుండా ఆందోళన చేయడం  ఉద్రిక్తతకు దారి తీసింది.

  


ఇంట్లో కూర్చొని బాధపడుతున్నా- రాజ్ తరుణ్


అటు ప్రెస్ మీట్‌లో లావణ్యతో వివాదానికి సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు రాజ్ తరుణ్ సమాధానం చెప్పారు. ఈ వివాదం తన తర్వాతి సినిమాల మీద ఏమాత్రం ఉండబోదన్నారు. అయితే, ఈ వివాదం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టాన్ని కలిగించిందన్నారు. “రెమ్యునరేష్ అనేది సినిమా రిజల్ట్ ను బట్టి ఉంటుంది. నా నటన గురించి అందరికీ తెలుసు. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సినిమాలకు సంబంధించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, వ్యక్తిగతంగా నాకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. విమర్శలకు గురయ్యాను. ఈ వివాదం కారణంగా చాలా రోజులుగా ఇంట్లో కూర్చొని బాధ పడుతున్నాను. నాతోపాటు నా పేరెంట్స్ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. నేనే హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎక్కడికి పారిపోలేదు. నా ఇమేజ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే బయటకు రావడం లేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాల కంటే నా దగ్గర ఎక్కువ ఆధారాలున్నాయి” అని చెప్పుకొచ్చారు.


దయచేసి వ్యక్తిగత విషయాలు అడగకండి - రాజ్ తరుణ్


అటు మీడియా ప్రతినిధులు సినిమాకు సంబంధించి కాకుండా, పూర్తి స్థాయిలో లావణ్య వివాదంపై స్పందించడం పట్ల రాజ్ తరుణ్ అసహనం వ్యక్తం చేశారు. “సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలు అడగకండి. పదే పదే నా వ్యక్తిగత విషయాలను చర్చకు పెట్టకండి. నా మీద వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను. నా మీద ఇప్పటి వరకు ఎవరూ చెడుగా మాట్లాడలేదు. తొలిసారి లావణ్య కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆమె ఆరోపణలు అన్నీ అవాస్తవాలని త్వరలోనే తేలిపోతాయి” అని వెల్లడించారు.


Read Also: ‘కమిటీ కుర్రోళ్లు‘ వస్తున్నారు, బాబాయ్ బిజీ.. మా నాన్న దొరకడం లేదు: నిహారిక కొణిదెల



Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!