'నువ్వు సీతవైతే నేను రాముడిని అంట... నువ్వు రాధావైతే నేను కృష్ణుడిని అంట'' అంటూ శ్రుతీ హాసన్‌తో ''నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవంటా!'' పాటలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్టెప్పులు వేశారు. 'వాల్తేరు వీరయ్య' నుంచి రెండు వారాల క్రితం విడుదలైన ఆ పాట మెలోడీలు ఇష్టపడే వాళ్ళను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మరో పాటతో ఈ జోడీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 


నీకేమో అందం ఎక్కువ...
నాకేమో తొందర ఎక్కువ!
Waltair Veerayya Songs : 'వాల్తేరు వీరయ్య' నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. నాలుగో పాటను జనవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'నీకేమో అందం ఎక్కువ... నాకేమో తొందర ఎక్కువ' అంటూ ఆ పాట సాగుతుందని మెగాస్టార్ మెగా లీక్ ఇచ్చేశారు. అంతే కాదు... మేకింగ్ వీడియో వీడియో చిరంజీవి విడుదల చేశారు. 


ఫ్రాన్స్‌లోని తులుస్‌ సిటీలో సాంగ్‌ షూట్‌ చేసినట్టు చిరంజీవి తెలిపారు. అక్కడ మంచు లేదు కానీ... చలి మాత్రం ఉందన్నారు. దర్శకుడు బాబీ చెప్పిన కాన్సెప్ట్‌తో శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో అందంగా సాంగ్‌ చేశామని చెప్పారు.


Also Read : రష్మిక - విజయ్ దేవరకొండ - న్యూ ఇయర్ కహానీ ఏంటి?
  





చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. ఒకటి... 'బాస్ పార్టీ'. అది ఆడియన్స్‌లోకి బాగా వెళ్ళింది. రెండోది... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి'. ఇది మెలోడియస్‌గా ఉంది. మూడోది టైటిల్ సాంగ్. 


రొటీన్ కమర్షియల్... 
రాసుకోండి! కానీ... 
ఆల్రెడీ విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగులో చిరంజీవి స్టిల్స్, 'గ్యాంగ్ లీడర్' రోజులను గుర్తు చేశాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే... సినిమా రెడీ అయ్యింది. చిరంజీవి చూశారు కూడా! రొటీన్ సినిమాలా ఉందని అంటున్న ప్రేక్షకులకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ''రాసుకోండి, ఇది రొటీన్ సినిమానే. కానీ, లోపల వేరుగా ఉంటుంది'' అని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించనున్నారు.   


విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్!
సంక్రాంతి కానుకగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జనవరి 8న విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Waltair Veerayya Pre Release Function) నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. విశాఖలో ఫంక్షన్ అని చిరు కూడా కన్ఫర్మ్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.


Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్! 


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.