ముచ్చింతల్... తెలంగాణలోని ఆ ప్రాంతంలో ఇటీవల ప్రజలకు స్ఫూర్తిని పంచే సమతామూర్తి (రామానుజాచార్యులు) విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సమతామూర్తిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి ఆయన కేరళలోని శబరిమలకు వెళ్ళారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల నుంచి గురువాయూర్ వెళ్ళారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం మొదలైన ఈ ఆధ్యాత్మిక యాత్ర 13వ తేదీ సాయంత్రం ముగిసిందని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. యాత్ర వీడియో కూడా పోస్ట్ చేశారు. చిరంజీవి దంపతులతో 'ఫోనిక్స్' చుక్కపల్లి సురేష్ దంపతులు కూడా ఉన్నారు. 


శుక్రవారం (ఫిబ్రవరి 18న) చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా  రామ్ చరణ్ తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేశారు.


Also Read: బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పాన్ ఇండియా సినిమా, ఇదిగో అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌


Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!