బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే. 


ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న టీజర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో 'కుంకుమలా' అంటూ సాగే సాంగ్ ప్రోమోను వదిలారు. ఈ పాటకు హిందీలో అమిత్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. తెలుగులో చంద్రబోస్  సాహిత్యం అందించారు. హిందీలో వెర్షన్ ఆర్జిత్ సింగ్ పాడగా.. తెలుగులో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ ప్రోమోను రాజమౌళి విడుదల చేశారు. విజువల్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 


'బ్రహ్మాస్త్ర'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: రాజమౌళి ఫ్యామిలీ చేసిన పనికి రామ్ అప్‌సెట్‌- అసలేం జరిగిందంటే?


Also Read: 'కేజీఎఫ్' బ్యూటీ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?