Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంటర్ అయిన అందరు కంటెస్టెంట్స్‌లో టాప్ ఆరుగురు ఫినాలే వీక్‌కు చేరుకున్నారు. అందుకే వారంతా ఇంటి ఫుడ్‌ను మిస్ అవుతున్నారని బిగ్ బాస్ భావించారు. 14 వారాల నుంచి బిగ్ బాస్ హౌజ్‌లోనే ఉండడంతో వారి ఇంటి ఫుడ్ టేస్ట్‌ను మిస్ అవుతున్నారని, అందుకే కంటెస్టెంట్స్ అందరి కోసం వారి ఇంటి నుంచి ఫుడ్ వస్తుందని బిగ్ బాస్ తెలిపారు. కానీ ఆ ఫుడ్‌ను బిగ్ బాస్ అంత ఈజీగా ఇవ్వడుగా..! అక్కడ కూడా ట్విస్ట్ పెట్టాడు. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో జరిగిన టాస్కులు రివైండ్ చేస్తూ.. ఒక కంటెస్టెంట్.. మరొక కంటెస్టెంట్ కోసం ఆడి వారి ఫుడ్‌ను గెలిచి వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి. అంతే కాకుండా గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంట్లోకి గ్రహంతరవాసులు వచ్చారు. వారిని ఎంటర్‌టైన్ చేయడానికి కంటెస్టెంట్స్ తిప్పలు పడ్డారు.


మరోసారి నోరుజారిన శివాజీ..
ముందుగా వేరే గ్రహం నుంచి బిగ్ బాస్ హౌజ్‌లోకి ‘హాచీ’ వచ్చింది. ఆ హాచీనే కంటెస్టెంట్స్‌కు ఇంటి ఫుడ్‌ను తీసుకొచ్చింది. ముందుగా అర్జున్‌కు తన భార్య వీడియో మెసేజ్‌తో పాటు తనకు ఇష్టమైన ఫుడ్‌ను పంపింది. అయితే అర్జున్.. ఈ ఫుడ్ తినడానికి అనుమతి పొందాలంటే యావర్.. ఒక టాస్క్ ఆడి గెలవాలి. ఆ టాస్క్ మరేదో కాదు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో ఆడిన బాల్స్ టాస్కే. ఇక ఆ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఆడి అర్జున్‌కు తన ఇంటి ఫుడ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు యావర్. ఆ ఫుడ్‌ను ఇతర హౌజ్‌మేట్స్‌తో పంచుకొని తిన్నాడు అర్జున్.


టాస్క్ అయిపోయిన తర్వాత స్పై బ్యాచ్ అంతా కూర్చొని సీజన్ మొత్తంలో తమరిని ఎక్కువ ఎవరు నామినేట్ చేశారు అనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సందీప్, ప్రియాంక, శోభా, అమర్.. ఎక్కువగా తనను నామినేట్ చేసేవారని యావర్ చెప్పాడు. ఆ తర్వాత శివాజీని ఎక్కువగా ఎవరు నామినేట్ చేసేవారని అడిగాడు. ‘‘ఈ ముష్టి బ్యాచే. అన్ని ముష్టి పాయింట్లు చెప్తారు వాళ్లు. ఒక్కటి కూడా సరిగ్గా, లాజికల్‌గా మీరు ఇలా తప్పు చేశారు అని చెప్పారు. మీ ఆట నాకు నచ్చలేదు అంటారు. చివరి నామినేషన్‌లో శోభా కూడా అలాగే చెప్పింది. మరి తనదేమైనా ఒలింపిక్ పర్ఫార్మెన్సా. వాళ్లవి అన్నీ అంతే. అమర్ కూడా మీ ఆట నాకు నచ్చలేదు అంటాడు. మరి వాళ్ల ఆట ఏమైనా బాగుందా.. వాళ్లు కూడా ఇంతే ఆడారుగా. ముష్టి పాయింట్లు. ముష్టినాయాళ్లు’’ అని మరోసారి అనవసరంగా ఇతర కంటెస్టెంట్స్ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ.


నీళ్లు తాగి కడుపు నింపుకున్నావు..
ఆ తర్వాత శివాజీకి తన ఇంటి ఫుడ్‌తో పాటు తన కొడుకు దగ్గర నుంచి వీడియో మెసేజ్ కూడా వచ్చింది. ‘‘మేము మీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. పంపించడానికి కారణం ఏంటంటే హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో పార్క్‌లో నిద్రపోయేవాడినని, ఆకలితో నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పావు. ఏ ప్రేక్షకులు అయితే నీకు ఆకలి భయం పోగొట్టారో.. అదే ప్రేక్షకుల తరపున నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ చికెన్ కర్రీ పంపిస్తున్నాం’’ అని శివాజీ కొడుకు వీడియోలో తెలిపాడు.


ఇక ఆ ఫుడ్ కోసం ప్రియాంక విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే టాస్క్ ఆడి గెలిచింది. అమర్ కోసం తన భార్య తేజస్విని రొయ్యల బిర్యానీ పంపించింది. దానికోసం శివాజీ బెలూన్స్‌ను పగలగొట్టే టాస్క్ ఆడాడు. టాస్కులు ఆడడం, గెలవడం వరకు బాగానే ఉంది. కానీ కంటెస్టెంట్స్ అంతా తనకు బోర్ కొట్టిస్తున్నారని హాచీ ఫీల్ అయ్యింది. అందుకే తన తోటి గ్రహంతరవాసులను హౌజ్‌లోకి పంపింది. వారంతా కంటెస్టెంట్స్‌తో కాసేపు ఆడుకున్నారు. కంటెస్టెంట్స్ అంతా ఆ గ్రహంతరవాసులు చెప్పింది చేసి వారిని తృప్తిపరిచారు.


Also Read: మూడు భాగాలుగా 'రామాయణం' - రణ్ బీర్, సాయి పల్లవి షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడే!