బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే మండే వచ్చేసింది. సోమవారం వచ్చిందంటే ముందు రోజు సరదాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకున్న వాళ్ళు కూడా మండే నామినేషన్స్​లో ట్విస్ట్​లు ఇస్తారు. గొడవలు, ఏడుపులు, అరుపులతో సోమవారం మోత మోగిపోతుంది. ఇక ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంబంధించి ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.


మెచ్యూరిటీ లేదు.. 


ఇప్పటి వరకు పాత ఇంటి సభ్యులను ఆటగాళ్లుగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్​ని పోటుగాళ్ళుగా ఉన్నారు. కానీ ఇక నుంచి అందరూ సమానమేనని తేల్చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు అనర్హులగా భావించే ఇద్దరు సభ్యుల ముందు ఉన్న కుండని పగలగొట్టమని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగా ప్రశాంత్ సందీప్​ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. “కెప్టెన్ అంటే ఇంటికి పెద్ద లెక్క. కానీ నేను మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఏయ్ పో అన్నట్టు మాట్లాడావ్” అని ప్రశాంత్ సందీప్ కెప్టెన్​గా ఉన్నప్పుడు తన ప్రవర్తన నచ్చలేదని నామినేట్ చేశాడు. ప్రశాంత్ చెప్పిన రీజన్​ని సందీప్ వ్యతిరేకించాడు, తనలో మెచ్యూరిటీ కనిపించలేదని అన్నాడు.


పదేళ్ళ పిల్లాడిలా కనిపిస్తున్నావ్..


అమర్ దీప్.. అశ్విని శ్రీని నామినేట్ చేశాడు. ఐదు వారాలు ఉన్నావ్ కదా ఇక చాల్లే అన్నట్టు అశ్విని మాట్లాడిందని అమర్ చెప్పుకొచ్చాడు. అయితే అశ్వినికి బిగ్ బాస్ అర్థం కాలేదని మరొకసారి రుజువైంది. అమర్​ని పట్టుకుని ప్రతీ సారీ ప్రశాంత్.. ప్రశాంత్ అని సంబోధిస్తూ మాట్లాడింది. దీంతో అమర్​కి బాగా కాలినట్టుగా అనిపించింది. నాకు ఎటువంటి ఇగో లేదని అమర్​కి చెప్పేందుకు చూసింది. ప్రశాంత్ నువ్వు వచ్చి నా ప్లేస్ లో నిలబడు అంటూ అమర్ కోపంగా అన్నాడు. భోలే షావలి అమర్​ని ఉద్దేశించి పదేళ్ళ పిల్లాడిలా కనిపిస్తున్నావ్ అనేసరికి సీరియస్ గా వచ్చేసి తన ముందు ఉన్న కుండని పగలగొట్టి నామినేట్ చేశాడు అమర్. పూజా మూర్తి కూడ అశ్వినిని నామినేట్ చేసింది.


బయటకి వెళ్ళిపోయిన శివాజీ


బిగ్ బాస్ శివాజీని కన్ఫెషన్ రూమ్​కి పిలిచి బయటకి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ఇక అదే విషయాన్ని శివాజీ ఇంటి సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి అంటూ అందరూ తనను చుట్టుముట్టారు. బిగ్ బాస్ గేట్లు తెరుచుకోగానే లేదు నేను వెళ్లిపోతున్నా అనేసి శివాజీ వెళ్ళిపోవడం చూపించారు. గత కొన్ని రోజులుగా శివాజీ భుజం నొప్పి, బ్యాక్ పెయిన్​తో బాధపడుతున్నాడు. శివాజీ వెళ్లిపోవడంతో ప్రశాంత్, శోభా బాగా ఏడుస్తూ కనిపించారు. ప్రశాంత్​ని అమర్ ఓదార్చడానికి ప్రయత్నించాడు. శివాజీ సడెన్​గా వెళ్లిపోవడంతో ఇంటి సభ్యులందరూ ఎమోషనల్ అయ్యారు.


Also Read: దామిని, రతిక, శుభశ్రీలలో రీ-ఎంట్రీ ఇచ్చేది ఎవరు? ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున