Bigg Boss season 7 Promo : బిగ్​బాస్​లో కెప్టెన్సీ టాస్క్​ తుది దశకు చేరుకుంది. గౌతమ్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ రేస్​లో ఉన్నారు. అయితే ఈ వారం బిగ్​బాస్​ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్​బాస్​ ఫైనల్ టాస్క్​ ఒకటి ఇచ్చారు. అదే ఈ మిర్చి చాలా హాట్. ఈ టాస్క్​లో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్​ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారో అనేది మిగతా ఇంటి సభ్యులు నిర్ణయించాలని సూచించారు. ఈ ప్రక్రియను అమర్ ప్రారంభించారు.


దీనికి నామినేషన్స్​కి సంబంధం ఉందా?


"నీ పక్కన ఉన్నవాళ్లు అంతా నామినేషన్స్​లోనే ఉన్నారు. వాళ్లకి వాళ్లు కాపాడుకోవాలి. మళ్లీ తిరిగి ఆడాలని వాళ్లకి ఉంటుంది" అని అమర్.. ప్రశాంత్​ను ఉద్దేశించి తెలిపాడు. దానికి బదులుగా ప్రశాంత్ "ఇది నాకు వేస్తే వాళ్లు సేవ్ అయితారంటే నేను కచ్చితంగా వేయించుకుంటాను" అని ప్రశాంత్ బదులు ఇచ్చాడు. దీనికి నామినేషన్స్​కి సంబంధం ఉందా అంటూ ప్రశ్నించాడు. "ఇక్కడ నచ్చాల్సింది ఒకరిద్దరికీ కాదు. హౌజ్ అందరికీ నచ్చాలని" అమర్ మిర్చి దండను ప్రశాంత్ మెడలో వేశాడు. 


పక్కకెళ్లి ఆడుకోమ్మా..


అనంతరం భోళే షావల్​ ఈ ప్రక్రియను కంటిన్యూ చేశారు. ప్రియాంకను ఉద్దేశిస్తూ.. "నాకు కనిపడిన అందరిలో ప్రస్తుతం ఇప్పుడు.. నువ్వు  అనగానే.." ప్రియాంక తగులుకుంది. "ఇప్పుడు నేను ప్రశాంత్​లాగా మాట్లాడి చెప్పనా.. పక్కకెళ్లి ఆడుకోమ్మా.. అని చెప్పినట్టుంది." మధ్యలో ప్రశాంత్ ఎందుకొచ్చాడంటూ భోళే అడుగగా.. మీరు మధ్యలో తీసుకొచ్చినప్పుడు నేను తీసుకురాలేనా అని ప్రియాంక తెలిపింది. దీంతో భోళే వెళ్లి ఆమె మెడలో మిర్చి దండ వేశారు. 


తర్వాత రతిక వచ్చింది. శోభా నువ్వు కెప్టెన్ అయితే.. నువ్వు ఇదే పరిస్థితి నీకు హోజ్​మేట్స్​తో వస్తే.. ఇంతే బ్యాలెన్సింగ్ నీలో ఉండదని తెలిపింది. దానికి బదులు ఇచ్చిన శోభా.. "వాళ్లకి ప్రాబ్లం ఉంటే.. అది వాళ్లు చూసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం" అంటూ ప్రశ్నించింది. ఇది మార్చుకుంటే బెటర్​ అన్నది. రతిక శోభా మెడలో ఈ మిర్చి దండను వేసింది. అనంతరం.. తేజ మిర్చిదండను తేజ మెడలో వేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. అశ్విని వచ్చి పర్సనల్​గా ఈ దండ వేయొట్లేదని ప్రియాంకను ఉద్దేశించి తెలిపింది. 


నువ్వు పిచ్చోడివి..


యావర్​కి, శోభకు ఈ ఫైన్​లో టాస్క్​లో గట్టి వాగ్వాదమే జరిగింది. నువ్వానేనా అంటూ ఇద్దరు మాటల యుద్ధం చేశారు. "నీలాగా బక్వాస్ రీజన్ ఇవ్వను. కానివ్వు దా ఈ పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు నువ్వు నా ప్లేస్​లో ఉంటావ్. నేను నీ ప్లేస్​లో ఉంటాను. అప్పుడు మాట్లాడుతా.. పిచ్చోడు నువ్వు" అని అంది. "నన్ను పిచ్చోడు అంటున్నావా" అని యావర్ ప్రశ్నించగా.. "అవును..అంటాను మళ్లీ అంటాను.. ఏమి చేస్తావు అంటూ" శోభా యావర్​ని రెచ్చగొట్టింది. "పిచ్చోడా నేను" అని మళ్లీ యావర్​ అడుగగా.. "అవును అవును" అంటూ మీదకి వెళ్లింది. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. దీంతో యావర్ మిర్చి దండను నేలకు బలంగా కొట్టాడు. ఈ ఘటనతో ప్రోమో కంప్లీట్ అయింది. 


గతవారం భోళే ఎర్రగడ్డ హాస్పిటల్​ అని అన్నప్పుడే ఫుల్ ఫైర్ అయిన శోభ.. ఇప్పుడు యావర్​నే పిచ్చోడూ అంటూ రెచ్చగొట్టింది. రతిక ప్రభావం పడిన యావర్​ కూడా.. అదే రెచ్చిపోయి.. గత కొద్ది వారాలుగా సహనాన్ని వదిలేశాడు. శివాజీ వద్దని వారిస్తున్నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 


">


Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?