బిగ్ బాస్ సీజన్ 7 కంటే ముందు పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలామంది ప్రేక్షకులకు తెలియదు. తను బిగ్ బాస్ షోలోకి రావాలని ఎంత తపనపడ్డాడో కేవలం తన వీడియోలు చూసేవారికి మాత్రమే తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నారు. షో ప్రారంభం అయిన కొన్నిరోజుల్లోనే ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ కంటెస్టెంట్స్ అంతా వ్యాఖ్యలు చేశారు. తనను దూరం పెట్టారు. దీంతో ప్రేక్షకుల్లో ప్రశాంత్ పట్ల జాలి పెరిగింది. అలాగే తనకు ఓట్లు వేసే ఫ్యాన్స్ కూడా పెరిగారు. అలాంటి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అయ్యాడు.


ప్రేక్షకుల్లో పెరిగిన ఫాలోయింగ్..


పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టినప్పటి నుండి తను ఆడిన ప్రతీ ఆటలో తనదే విజయం అయ్యిండాలి అనుకోవడం మొదలుపెట్టాడు. ఏదైనా ఆటలో ఓడిపోతే కెమెరాల ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యేవాడు. కొందరు ప్రేక్షకులు ప్రశాంత్ ప్రవర్తనకు కంటెంట్ అని పేరు పెట్టారు. కొందరు కంటెస్టెంట్స్ కూడా తనను వేరుగా చూడడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 7లోని రెండోవారం నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు, ప్రశాంత్ ఒకవైపు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. దీంతో ప్రేక్షకుల్లో ప్రశాంత్‌కు సపోర్ట్ పెరిగిపోయింది. ఎన్నిసార్లు ప్రశాంత్.. నామినేషన్స్‌లోకి వచ్చినా తనకు ఓట్లు వేసి కాపాడే ఫ్యాన్స్ ఎక్కువయిపోయారు.


శివాజీ సపోర్ట్‌తో..


బిగ్ బాస్ హౌజ్‌లో ప్రశాంత్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ.. తనను ముందుకు తీసుకెళ్లేవారిలో శివాజీ ఒకరు. హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి శివాజీ ఎక్కడ ఉంటే.. పల్లవి ప్రశాంత్ అక్కడే. ప్రశాంత్ వెనకబడిన ప్రతీసారి శివాజీ.. తనను ప్రోత్సహించి టాస్కుల్లో విజయం సాధించేలా చేస్తాడు. అందరూ ప్రశాంత్‌ను ఎదిరిస్తూ మాట్లాడినా.. శివాజీ మాత్రమే తనకు సపోర్ట్‌గా ఉంటాడు. అందుకే తాజాగా జరిగిన టాస్కులో కూడా పల్లవి ప్రశాంత్ కోసం తనకు ఇంటి నుండి వచ్చిన లెటర్‌తో పాటు కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను త్యాగం చేశాడు శివాజీ. దీంతో కెప్టెన్సీ కోసం సందీప్, టేస్టీ తేజ, గౌతమ్‌తో పోటీపడ్డాడు పల్లవి ప్రశాంత్.


పవర్ అస్త్రాతో పాటు కెప్టెన్సీ..


కెప్టెన్సీ టాస్క్ విషయంలో సందీప్‌కు, పల్లవి ప్రశాంత్‌కు గట్టి పోటీనే జరిగింది. కానీ సందీప్ చేసిన చిన్న తప్పు వల్ల తను గేమ్ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరిగా గౌతమ్ కృష్ట, ప్రశాంత్ పోటీలో మిగిలారు. ఇద్దరు తమ వందశాతం గెలవడానికి ప్రయత్నించారు. చివరిగా ఈ ఆటలో పల్లవి ప్రశాంత్ గెలిచి బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అయ్యాడు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ దగ్గర పవర్ అస్త్రా ఉంది. దాంతో పాటు ఇప్పుడు కెప్టెన్సీ కూడా తనను వరించింది. దీంతో మరి కొన్నాళ్ల పాటు ఈ రెండిటికి సంబంధించిన ఇమ్యూనిటీ పల్లవి ప్రశాంత్‌కు లభిస్తుంది. ఇదే విధంగా తన ఆటను కొనసాగిస్తే.. పల్లవి ప్రశాంత్ ఫైనల్స్‌కు వెళతాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Also Read: నన్ను కొడితే నేను వాడి తాటతీస్తా, కొట్టి చూపించాలా - ప్రశాంత్‌కు సందీప్ వార్నింగ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial