బిగ్ బాస్ సీజన్ 2.0 వర్షన్ తో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే వారికి పవర్స్ కూడా వచ్చేశాయి. సండే ఫన్ డే అంటూ ఫుల్ డబుల్ ఎనర్జీ ఇచ్చేసిన బిగ్ బాస్ మండే మంట పెట్టేశారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోతుంది. అయితే ఈ సారి నామినేట్ చేసే బాధ్యత ఇంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో ఎవరు అనర్హులో సరైన కారణాలు చెప్తూ నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.


ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాబోతుంది. ఇందులో పోటుగాళ్ళు మాత్రమే నామినేషన్ చేస్తారు. బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదనుకునే వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పి మొహం మీద ఇంటూ మార్క్ వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగా నయని పావని టేస్టీ తేజని నామినేట్ చేసింది. గేమ్ ఎక్కువగా అడినట్టుగా అనిపించలేదని కారణం చెప్పింది. బిగ్ బాస్ అంటే కేవలం టాస్క్ ఒక్కటే కాదని గేమ్స్ ఒక్కటే ఆడి గెలిపించడం కాదని తేజ చెప్పుకొచ్చాడు. భోలే షావలి సందీప్ ని నామినేట్ చేశాడు. పవర్ అస్త్ర కోసం జరిగిన స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజని ఆపలేదని అది తనకి కరెక్ట్ అనిపించలేదని షావలి చెప్పుకొచ్చాడు. కానీ సందీప్ మాత్రం తేజ బయటకి వచ్చిన తర్వాత తన మీద గట్టిగా అరిచిన వ్యక్తిని తనేనంటూ సమర్థించుకున్నాడు.


ఇక పూజా మూర్తి కూడా తేజని నామినేట్ చేసింది. స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజ చేసిన పనిని తప్పుబట్టింది. అందరూ వద్దు తేజ అని అరుస్తుంటే అది ఎంకరేజ్ మెంట్ ఎలా అవుతుందని పూజ నిలదీసింది. అమర్ దీప్ ఆడటం సెల్ఫిష్ గా అనిపించిందని అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. సెల్ఫిష్ గా ఆలోచించాలి అది గేమ్.. ఇక్కడికి వచ్చిందే నా గురించి నేను ఆలోచించుకోవడానికని అమర్ తేల్చి చెప్పేశాడు. తర్వాత అశ్విని శోభాని నామినేట్ చేసింది. గ్రూపిజం చేస్తున్నారని శోభాని ఉద్దేశించి అశ్విని చేసిన వ్యాఖ్యల్ని డాక్టరమ్మ బాగానే వ్యతిరేకించింది. అసలు తను నోరు తెరిచి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా గ్రూపిజం వల్ల ఎవరు నష్టపోయారంటూ నిలదీసింది. ఈ కారణం చెప్పి నామినేట్ చేస్తే చాలా బాధగా ఉంటుందని చెప్పింది. అలా ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న వారి గురించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు నామినేట్ చేశారు. మరి ఈ వారం ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారంతా కన్ఫర్మ్ హౌజ్‌మేట్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటినుండి హోస్ట్ ఆఫ్ బెడ్స్ చేతిలోనే ఎవరు ఎక్కడ పడుకోవాలని నిర్ణయం ఉంటుందని అన్నారు. దీంతో ముందు నుండి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మనసులో అసూయ మొదలయ్యింది.


Also Read: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’, ఇంతలో నాన్న చనిపోయారనే వార్త - పూజా మూర్తి భావోద్వేగం