బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు అయిదు వారాలు పూర్తి అయ్యాయి. మొదటి నాలుగు వారాల్లో ఒకరి తర్వాత ఒకరుగా కంటిన్యూగా లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈసారి అలా జరగదు అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు కానీ అయిదో వారంలో కూడా లేడీ కంటెస్టెంటే.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయింది. తనే శుభశ్రీ. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని శుభశ్రీ ఎలిమినేట్ అయిన కాసేపటికే గౌతమ్ కూడా ఎలిమినేట్ అని ప్రకటించారు నాగార్జు. కానీ శుభశ్రీ హౌజ్ వదిలి వెళ్లిపోగా.. గౌతమ్ మాత్రం సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. శుభశ్రీ బయటికి వెళ్లగానే బిగ్ బాస్ బజ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.


విన్నర్ అవుతా అనుకున్నా..


బిగ్ బాస్ బజ్‌లో శుభశ్రీ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ముందుగా ‘‘ఎన్ని వారాలు ఉంటావని అనుకున్నావు’’ అని గీతూ అడిగే ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘నేను అయితే విన్నర్ అవుతా అని అనుకున్నాను’’ అని సమాధానమిచ్చింది శుభశ్రీ. తన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి గీతూ సైతం ఆశ్చర్యపోయింది. ‘‘హౌజ్‌లో ఏది ఎక్కువ మిస్ అవుతున్నారు’’ అని అడిగింది గీతూ. ‘‘డీలక్స్ రూమ్‌లో ఆ కార్నర్‌ను చాలా మిస్ అవుతున్నాను’’ అని చెప్పింది శుభ. ‘‘మీరు, గౌతమ్ మాట్లాడుకున్న చోటా లేదా మీరూ, యావర్ మాట్లాడుకున్న చోటా’’ అని కౌంటర్ ఇచ్చింది గీతూ. దానికి శుభశ్రీ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకుంది.


బిగ్ బాస్ హౌజ్‌లో ట్రాక్స్..


‘‘మనోభావాలు దెబ్బతిన్నాయా’’ అన్న ప్రశ్నకు ‘‘అమర్‌దీప్ గారి మనోభావాలు దెబ్బతిన్నాయి’’ అంటూ తమ నామినేషన్స్ గొడవను గుర్తుచేసుకుంది శుభశ్రీ. ‘‘హౌజ్‌లో ట్రాక్స్ నడిచాయి అంటే దానికి మీ సమాధానం ఏంటి’’ అని అడిగింది గీతూ. ‘‘ప్రశాంత్, రతిక గురించి చెప్తున్నారా’’ అని ఏం తెలియనట్టు అమాయకంగా అడిగింది శుభశ్రీ. ‘‘రతికతో మాత్రమే ట్రాక్స్ ఉన్నాయా ఇంకా ఎవరితో లేవా’’ అని స్పష్టంగా అడిగింది గీతూ. ‘‘ఛాన్సే లేదు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది శుభ. ‘‘గౌతమ్‌తో పెయిర్ అవ్వడం మైనస్ అయ్యంది అనుకుంటున్నారా? ప్లస్ అయ్యింది అనుకుంటున్నారా?’’ అని అడిగింది గీతూ. గీతూ అడిగిన చాలావరకు ప్రశ్నలకు శుభశ్రీ ఏం సమాధానాలు ఇచ్చిందని ప్రోమోలో చూపించలేదు.


గౌతమ్ నమ్మకస్తుడు కాదు


‘‘గౌతమ్ చేతిలో కీలుబొమ్మ శుభశ్రీ’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది గీతూ. ‘‘ఎవరి బొమ్మ కాదు’’ అని సమాధానమిచ్చింది శుభశ్రీ. ‘‘మీరు బయటికి రావడానికి ఇదే కారణం అయ్యిండొచ్చేమో అని మీ అంచనా లేదా ఈ కంటెస్టెంట్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యానేమో’’ అంటే ‘‘కచ్చితంగా అమర్‌దీప్’’ అని వెంటనే సమాధానమిచ్చింది శుభశ్రీ. ‘‘మీరు ప్రేక్షకులకు సమాధానం ఇవ్వాల్సిందే. గౌతమ్, యావర్‌లో ఒకరిని ఎంచుకోండి’’ అని అడిగింది గీతూ. ఈ ప్రశ్నకు అనూహ్యంగా.. ‘‘గౌతమ్ నమ్మకస్తుడు కాదు.. స్వార్థపరుడు’’ అంటూ సమాధానమిచ్చింది శుభశ్రీ. హౌజ్‌లో ఉన్నంతవరకు టాస్కులలో యాక్టివ్‌గా పాల్గొనకుండా.. ముందుగా గౌతమ్, ఆ తర్వాత యావర్‌తో నడిపించిన ట్రాకులే శుభశ్రీ ఎలిమినేషన్‌కు కారణమయ్యాయని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: శుభశ్రీ ఔట్, గౌతమ్‌ను ఇంటి నుంచి గెంటేసిన ఆ రెండు గ్రూపులు - అంతలోనే ఊహించని ట్విస్ట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial