బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు. 


బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్ వచ్చి తమ సినిమా గురించి మాట్లాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు.  అషురెడ్డికి బకెట్, నటరాజ్ మాస్టర్ కి కొరడా.. ఇలా ఫన్నీ అవార్డ్స్ ప్రకటించారు. 


ఆ తరువాత టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేసే సమయం వచ్చిందని చెప్పారు నాగార్జున. హౌస్ లో ఉన్నవారిని గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పారు. అనంతరం ఫ్లాగ్స్ తో వారు సేఫా..? కాదా..? అనేది చెప్పారు. ఈ క్రమంలో మిత్రాశర్మకి రెడ్ ఫ్లాగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయిందని ప్రకటించారు. దీంతో ఆమె స్నేహితుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ మిత్రా మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో మాట్లాడింది. 


Also Read: టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు ఔట్ - ఎవరంటే?


Also Read: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్