బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. మిత్రాశర్మ, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. నిజానికి ప్రతి సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండేవారు. ఈసారి మాత్రం ఏడుగురు ఉన్నారు. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 


టాప్ 2 అండ్ 3లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు. దీంతో ఒక్కొక్కరూ వారి అభిప్రాయాలను తెలిపారు. అనంతరం టాప్ 7 కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. వారికి లొకేషన్స్ పిన్స్ ఇచ్చి.. హౌస్ లో వారి ఫేవరెట్ ప్లేస్ గురించి చెప్పమని అడిగారు. ఆ తరువాత నామినేషన్స్ మొదలుపెట్టారు. హౌస్ మేట్స్ ముందు బెలూన్స్ పెట్టి అందులో రెడ్ వస్తే ఎలిమినేషన్ అని.. గ్రీన్ వస్తే సేఫ్ అని చెప్పారు. 


ఈ క్రమంలో అనిల్ రాథోడ్ బెలూన్ లో రెడ్ కలర్ బెలూన్స్ ఉండడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి వర్రీ లేదని.. బిగ్ బాస్ తనకొక మంచి ఆపర్చ్యునిటీ అని.. ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.