బిగ్ బాస్ సీజన్ 5 తొలిరోజు నుంచి ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈసారి హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ లో చాలా మంది గొడవల బ్యాచ్ లానే ఉన్నారు. రెండో వారంలో అయితే రచ్చ మాములుగా లేదు. హౌస్ లో చాలా దారుణాలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ లో అమ్మాయిల టీషర్ట్స్ చేతులు పెట్టడాలు, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇలానే చాలానే జరిగాయి. తొలివారం నామినేషన్స్ లో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. 


Also Read: బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్.. హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగ్..


యానీ మాస్టర్, ఉమాదేవి, నటరాజ్,ప్రియాంక సింగ్, ప్రియా, ఆర్జే కాజల్, లోబోలు నామినేట్ కాగా.. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో ఓ వార్తలు చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. నామినేట్ అయిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ లకు వచ్చాయి. నిజానికి అందరూ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ ఈ వారం ఉమాదేవి బయటకు వెళ్లబోతుందట. 


తొలిరోజు నుంచి హౌస్ లో చాలా అగ్రెసివ్ గా ఉన్న ఉమాదేవి.. రీసెంట్ గా హౌస్ మేట్స్ తో గొడవ పడుతూ బూతులు మాట్లాడింది. ఆ మాటలకు బిగ్ బాస్ బీప్ వేసినప్పటికీ.. హౌస్ మేట్స్ కి మాత్రం ఆమె ప్రవర్తన నచ్చలేదు. షో చూస్తోన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిగా అనిపించింది. అయితే ఆ తరువాత ఆమెని పాజిటివ్ గా చూపించడానికి బిగ్ బాస్ చాలానే ప్రయత్నించారు. కానీ నామినేషన్స్ లోకి వచ్చిన తొలి రెండు రోజుల్లో ఆమెకి అసలు ఓట్లు పడలేదని సమాచారం. 


గత రెండు రోజులుగా ఉమాదేవి తన పెర్ఫార్మన్స్ తో  ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవేళ ఓటింగ్ పక్కన పెట్టి బిగ్ బాస్ తన డెసిషన్ తీసుకుంటే మాత్రం నటరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టి షాకిచ్చినా.. ఇవ్వొచ్చు.