బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మానస్, ప్రియా, ప్రియాంక, లహరి, శ్రీరామచంద్రలలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో నాగార్జున చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ స్టేజ్ పై హౌస్ మేట్స్ పేర్లతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేశారు. 


Also Read: ప్రీ రిలీజ్ వేడుకకు అంతా సిద్ధం.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్, మెగా హీరోల రాక?


'మీ అందరి మనస్సులో క్వశ్చన్స్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్.. మరి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో ఇవాళ తెలుసుకోవాలి' అంటూ నాగార్జున బోర్డ్ మీదున్న రవి, ప్రియ పేర్లను సుత్తితో పగలగొట్టారు. ఈ వారంలో యాంకర్ రవి-లహరి మిడ్ నైట్ హగ్ చేసుకున్నారంటూ ప్రియా హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ముందుగా.. 'ఎవరితో చూశారు.. ఎక్కడ చూశారు' అంటూ ప్రియాను అడిగారు నాగ్. దాని ఆమె 'ఇన్ డీసెంట్ వేలో కాదు సర్.. బిజీగా ఉండడం చూశా అని' అనగానే.. 'హగ్ ఇవ్వడం బిజీగా ఉండడమా..?' అని నాగ్ ప్రశ్నించారు. 


తను అలా అనలేదని ప్రియా చెబుతుండగా.. కానీ అలానే కమ్యూనికేట్ అయిందని నాగ్ అన్నారు. ఆ తరువాత యాంకర్ రవితో.. 'సింగిల్ మెన్ అని నువ్ అన్నావా..?' అడిగారు నాగ్. దానికి రవి.. 'నేను అన్నాను సర్.. ఒప్పుకున్నాను కూడా' అని అనగా.. ఒప్పుకోలేదని ప్రియా చెప్పింది. ఆ తరువాత లహరిని పవర్ రూమ్ కి వెళ్లమని చెప్పారు నాగ్. ఆమెకి రవి,ప్రియా మాట్లాడుకున్న వీడియోను ప్లే చేసి చూపించారు. అందులో రవి క్లియర్ గా లహరి తన వెంట పడుతుందని, సింగిల్ మెన్ ని వదిలేసి నాతోనే ఉంటుందని అన్నాడు. వీడియో చూసిన లహరిని 'క్లారిటీ వచ్చింది కదా.. హాల్ లోకి వెళ్లి ఎవరిది తప్పుకాదో వాళ్లను హగ్ చేస్కో.. తప్పు చేశారు అనుకున్నవాళ్లను అక్కడ నిలదీయు' అంటూ నాగ్ చెప్పారు. ఆ తరువాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.