ఆహా ఓటీటీలో బాల‌కృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయిదో ఎపిసోడ్ మామూలుగా ఉండేలా లేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కు తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి,  సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ప్రోమో కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఫోటోలను  విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులతో పాటూ రాజమౌళి, కీరవాణి అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. 


మోహన్ బాబుతో మొదలై...
అన్‌స్టాపబుల్ షోను బాలయ్య మోహన్  బాబు ఫ్యామిలీతో మొదలుపెట్టారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మిలతో మొదటి ఎపిసోడ్ ఎనర్జిటిక్ గా  సాగింది. తరువాత నాని గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించాడు. తరువాత బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అల్లరల్లరి చేస్తూ షోను ముందుకు నడిపించారు. తాజాగా  అఖండ్ టీమ్ తో సందడి చేయించారు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ రాజమౌళి, కీరవాణితోనే.  రాజమౌళి ఎపిసోడ్ తరువాత  మహేష్ బాబు  ఎపిసోడ్ రాబోతోందని టాక్ వచ్చింది. అది కొంతవరకు నిజమే. షూటింగ్ కూడా జరిగినట్టు సమాచారం. కానీ ఇంకా ఎందుకు ప్రోమో కూడా రాలేదో తెలియడం లేదు. 


త్వరలో ఈ షోకు ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాబోతున్నారట. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందో, విడుదల తరువాతో రామ్, భీమ్ లిద్దరూ వచ్చే అవకాశం ఉంది.   


Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్


Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..


Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో


Also Read: అఫీషియల్... దర్శకుడిగా మరో అభిమానికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్


Also Read: 'తప్పని తెలిసాక దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు'.. 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్..


Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది


Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి