Ashish3 Title Glimpse : తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న దిల్ రాజు, శిరీష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హీరో ఆశిష్. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాగైనా తన నెక్ట్స్ మూవీతో హీరోగా తనని తాను ఫ్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నారు. ‘రౌడీ బాయ్స్’ విడుదలైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రెండు సినిమా చేస్తున్నారు. కాశి దర్శకత్వంలో ఓ సినిమా, అరుణ్ డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.


‘Ashish3’ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్


తాజాగా అరుణ్, ఆశిష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘Ashish3’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.  ఈ మూవీకి ‘లవ్ మీ’ అనే పేరు పెట్టారు. అంతేకాదు, ‘If You Dare’ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఈ సినిమా హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే, దయ్యంతో హీరో ప్రేమ కథ నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.



బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచిన ‘రౌడీ బాయ్స్’


ఇక ఆశిష్  హీరోగా తెరకెక్కిన తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొదటి సినిమా అయినప్పటికీ ఆశిష్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించాడు. అనుపమ  పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ అండ్ యాక్షన్ మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Read Also : ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?