Allu Arjun Fans Meet : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. 'పుష్ప' సినిమా రిలీజ్ అయ్యాక ఆయన రేంజ్ వరల్డ్ వైడ్ గా మరింతగా పెరిగింది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాలంటే క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానంతో ఆయన 'పుష్ప' సినిమాలో పాటలకు డ్యాన్సులు వేయడమే కాదు 'పుష్ప' స్టైల్లో బట్టలు కూడా వేసుకొని తిరుగుతారు. ఇక విదేశాల్లో ఇంతటి క్రేజ్ ఉందంటే అల్లు అర్జున్ కి మన దేశంలో ఏ రేంజ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనను కలవడానికి సైకిల్ మీద రాష్ట్రాలు దాటి వచ్చి టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.


తన ఫేవరెట్ హీరోను కలవడానికి ఓ వీరాభిమాని అతిపెద్ద సాహసం చేశాడు. ఊర్లు, జిల్లాలు, మండలాలు కాదు ఏకంగా రాష్ట్రాలను దాటి సైకిల్ పై ప్రయాణించి హైదరాబాద్ కి వచ్చాడు. యూపీలోని అలీగడ్ కు చెందిన ఈ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ కు చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలవడానికి సైకిల్ పై వచ్చిన ఈ ఉత్తర ప్రదేశ్ వాసి అల్లు అర్జున్ పై అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నాడు. అయితే ఎట్టకేలకు తాను అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ కలిసి ఆయనతో కాసేపు మాట్లాడడమే కాదు, ఫోటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే అతని వీరాభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. అతడిని ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. 






అభిమానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అతని కోరిక మేరకు తనను కచ్చితంగా యూపీలో కలుస్తానని మాట ఇచ్చారు. 'పుష్ప 2' మూవీ ప్రమోషన్స్ కోసం ఒకవేళ యూపీకి వస్తే కలుస్తానని అభిమానితో అల్లు అర్జున్ చెప్పారు. కాగా సదరు అభిమాని అల్లు అర్జున్ కు మొక్కను బహుమతిగా ఇవ్వడం విశేషం. మొత్తానికి అల్లు అర్జున్ అతని అభిమానానికి ఫిదా అయ్యి, మంచి భోజనం పెట్టించి, తిరిగి అతన్ని బస్సులో ఇంటికి పంపించాలని తన స్టాఫ్ తో చెప్పారు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


దీంతో అభిమానులు ఇదొక హార్ట్ ఫెల్ట్ సీనరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 6న రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్ లో జోరు పెంచబోతున్నారు. ఇక ఈ సినిమాలో 'పుష్ప పార్ట్ వన్'లో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న కంటిన్యూ చేయబోతోంది. అలాగే ఫాహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అద్భుతంగా వచ్చింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. 



Read Also : ఎలాన్ మస్క్ రోబోలను ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా? డైరెక్టర్ షాకింగ్ ఆరోపణలు