ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పన్నెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదమూడవ సీజన్ లో ఉంది. 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షోలో సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకొస్తున్నారు. అతడు మరెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 


ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల డాన్స్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఢీ సీజన్ 12 గ్రాండ్ ఫినాలేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో స్టైలిష్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారు. సెమీ ఫైనల్ పోరులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నుంచి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు. వీరిలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఎవరు అందుకుంటారో చూడాలి. 


త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో యాంకర్ ప్రదీప్.. అల్లు అర్జున్ గురించి గొప్పగా మాట్లాడుతూ.. కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని బుల్లితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోకి టీఆర్పీ ఓ రేంజ్ లో రావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 










ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి