Triptii Dimri: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘యానిమల్’ సినిమాతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో జోయా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. రణబీర్ తో  కలిసి ఆమె చేసిన సన్నివేశాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకోగా, ఈ సినిమా తర్వాత ఆ ప్లేస్ లోకి త్రిప్తి దిమ్రి వచ్చేసింది.


‘నేషనల్ క్రష్’ కామెంట్స్ పై స్పందించిన త్రిప్తి  


‘యానిమల్’ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది త్రిప్తి దిమ్రి. తాజాగా ఈ ముద్దుగుమ్మ విక్కీ కౌషల్, అమ్మీ వీర్క్ తో కలిసి ‘బ్యాడ్ న్యూస్’ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో త్రిప్తితో పాటు చిత్రబృందం పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘యానిమల్’ సినిమా తర్వాత నేషనల్ క్రష్ అని పిలవడం పట్ల తను ఎలా ఫీలైందో వివరించింది.


ఇంతకీ త్రిప్తి ఏం చెప్పిందంటే?     


తనను నేషనల్ క్రష్ అని పిలవడం పట్ల సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది త్రిప్తి. తనకు ఇంత మంచి క్రేజ్ తీసుకొచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. “’యానిమల్’ సినిమాతో నాకు దక్కిన క్రేజ్ పట్ల సంతోషంగా ఉన్నాను. దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను గతంలో నటించిన సినిమాలకు ‘యానిమల్’ మూవీ పూర్తి విరుద్దంగా ఉంటుంది. ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఈ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నా నటన పట్ల ప్రేక్షకులు మంచి రియాక్షన్స్ ఇచ్చారు. వారు నా నటన పట్ల ఎంతో అభిమానాన్ని చూపించారు. వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను” అని చెప్పుకొచ్చింది.   


ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అలా అనుకునేదాన్ని - త్రిప్తి


సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి అందరూ మాట్లాడుకోవాలని భావించేదానినని త్రిప్తి వెల్లడించింది. “నేను సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు నా నటన గురించి అందరూమాట్లాడుకోవాలని భావించేది. అయితే, నేను నటించిన కొత్త సినిమాలు అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. కానీ, ‘యానిమల్’ సినిమా తర్వాత నా గుర్తింపు మరో లెవల్ కు చేరింది. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇకపై నా కెరీర్ మరింత సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని భావిస్తున్నాను” అని త్రిప్తి చెప్పుకొచ్చింది.  


ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘బ్యాడ్ న్యూస్’ మూవీలో నటిస్తుంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడులకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.  ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. జూలై 19న ఈ సినిమా విడుదలకానుంది.



Also Read: నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్