ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు హీరోయిన్ పాయల్ ఘోష్ వెల్లడించింది. ముంబైలో ఓ షాపులో మందులు కొనుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. పాయల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె తన కారులోకి వెళ్తుండగా.. కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్ తో దాడి చేశారని వారి చేతిలో యాసిడ్ బాటిల్ కూడా ఉందని పాయల్ తెలిపింది. 


Also Read: లహరి మావయ్యగా రవి.. ఫన్నీ టాస్క్ తో నవ్వించే ప్రయత్నం..


అయితే ఈ దాడి నుంచి తాను తప్పించుకున్నట్లు.. కానీ ఎడమ చేతికి గాయాలయ్యాయని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో గట్టిగా అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని.. ఇదే మొదటిసారి అని పాయల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి సంబంధించి ఎవరినైనా.. అనుమానిస్తున్నారా అనే విషయంపై కొన్ని కామెంట్స్ చేసింది పాయల్. 


తెలిసినవాళ్లు కాదు కానీ ఓ ప్లాన్ ప్రకారం చేశారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ సంఘటన తరువాత నుంచి ప్రతి క్షణం తనకు భయమేస్తుందని.. దాన్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంటుందని వివరించింది. 


పాయల్ కెరీర్ విషయానికొస్తే.. 'ప్రయాణం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత 'ఊసరవెల్లి' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. 'పటేల్ కీ పంజాబీ షాదీ' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆమెకి నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఈ బ్యూటీ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై మీటూ ఆరోపణలు చేసింది.  


 






Also Read: 'బేబమ్మ' బర్త్ డే స్పెషల్.. వరుస సినిమా అప్డేట్స్..


Also Read: కృతి శెట్టి.. అందానికే ఆకృతి ఉంటే నీలా ఉంటుందేమో! ‘ఉప్పెన’ బ్యూటీ బేబమ్మ బర్త్‌డే నేడు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.