Telangana Assembly Election 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సందడి కొనసాగుతోంది.  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ నెమ్మదిగా ఉంది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనానికి గురవుతున్నారు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ, ఇతర అధికారులు కూడా ఓట్లు వేయడానికి తరలివస్తున్నారు. 

మధ్యాహ్నం  3 గంటల వరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89 

వరుస సంఖ్య జిల్లా పేరు  పోలింగ్ శాతం 
1 ఆదిలాబాద్   62.3%
2 భద్రాద్రి 58.3%
3 హైదరాబాద్ 31.1%  
4 జగిత్యాల 58.6%
5 జనగామ  62.2%
6 భూపాలపల్లి  64.3%
7 గద్వాల 64.4%
8 కామారెడ్డి 59%
9 కరీంనగర్ 56%  
10 ఖమ్మం 63.6% 
11 కుమరంభీం 59.6%
12 మహబూబ్‌ నగర్‌ 65%  
13 మంచిర్యాల 59.1%
14 మెదక్  69.3%
15 మేడ్చల్ మల్కాజిగిరి  38.2%
16 ములుగు       67.8%
17 నాగర్ కర్నూల్  57.5%
18 నల్గొండ    59.9%
19 నిజామాబాద్    56.5%  
  నారాయణపేట  57.1%
20 నిర్మల్ 60.3%
21 పెద్దపల్లి       59.2%
22  రాజన్న సిరిసిల్ల  56.6%
23 రంగారెడ్డి  42.4%
24 సంగారెడ్డి   56.2%
25 సిద్దిపేట  64.9%
26 సూర్యాపేట      62%
27 వికారాబాద్     57.6%
28 వనపర్తి  60%
29 వరంగల్    52.2%
30 యాదాద్రి భువనగిరి  64%

 

1 గంటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 36.68

అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతంఅత్యల్పంగా హైదరాబాద్ లో  20.79 శాతం

ఆదిలాబాద్  41.88%   , భద్రాద్రి       39.29%, హైదరాబాద్  20.79%  , జగిత్యాల  46.14%, జనగామ  44.31%, భూపాలపల్లి 49.12%, గద్వాల  49.29%, కామారెడ్డి  40.78%, కరీంనగర్  40.73%  , ఖమ్మం   42.93% , కుమరంభీం   42.77%, మహబూబ్‌ నగర్‌ 46.89%  , మంచిర్యాల 42.74%, మెదక్   26.00%, మేడ్చల్ మల్కాజిగిరి 50.80%, ములుగు      45.69%, నాగర్ కర్నూల్ 39.58%, నల్గొండ   42.50%  , నిజామాబాద్  39.66%  , నారాయణపేట 42.60%, నిర్మల్       41.74%, పెద్దపల్లి       44.49%, రాజన్న సిరిసిల్ల 39.07%, రంగారెడ్డి   18.07%  , సంగారెడ్డి  42.17%, సిద్దిపేట     44.35%, సూర్యాపేట    44.14%, వికారాబాద్    44.85%, వనపర్తి  40.40%, వరంగల్      42.0%  , యాదాద్రి భువనగిరి 45.07%

11 గంటలకు రాష్ట్ర వ‌్యాప్తంగా  20.64% పోలింగ్

అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినమా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ మొత్తం 20.63 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 12.39 శాతం ఓటింగ్ నమోదయినట్టు ఈసీ తెలిపింది.అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

హైదరాబాద్ లోనే తక్కువ

ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ నగరవాసులు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ మొదలైనప్పటి నుంచీ అత్యల్ప ఓటింగ్ హైదరాబాద్ లోనే నమోదవుతోంది.ఉదయం 9 గంటల వరకూ హైదరాబాద్ లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదవగా..ఈ శాతం 11 గంటలకు 12.39 శాతం, ఒంటిగంటకు  20.79 శాతం నమోదైంది.

మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని మార్చింది. సాయంత్రం 5:30 తర్వాతే విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. గతంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కు అనుమతి ఇవ్వగా తాజాగా సవరించింది.

Also Read: నా ఓటు వాళ్లకే వేశా - కేటీఆర్, అందరూ తరలిరావాలని పిలుపు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply