గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ శుభవార్త తెలిపింది. సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, అనంతరం ఉపాధి కల్పిస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు ఒక ప్రకటరలో తెలిపారు.


బీసీఏ, బీఎస్‌సీ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌సీ, ఈసీఈ, ఐటీ) పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జులై 12 లోపు 96036 90068, 80190 50334 ఫోన్‌ నంబర్ల ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.


* ఉచిత ఉపాధి శిక్షణ


సంస్థ: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌


అర్హత: బీసీఏ, బీఎస్‌సీ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌సీ, ఈసీఈ, ఐటీ).


వయోపరిమితి: 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: నిబంధనల మేరకు.


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 96036 90068, 80190 50334.


పేర్ల నమోదుకు చివరితేది: 12.07.2023.


ALSO READ: 


కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యలో టాప్ 10 దేశాలు ఇవే!
ఈరోజుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నేటి టెక్నాలజీ యుగంలో ఈ కోర్సు చదివేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, అంతకుమించిన వేతనాలు, భవిష్యత్తు అంతా టెక్నాలజీ రంగానిదే కావడంతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకే చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఇప్పుడు సీఎస్ఈ గ్రూపుపైనే ఎక్కువగా ఉంటోంది. చాలా కాలేజీల్లో సీఎస్ఈ గ్రూపు సీట్లు ఇట్టే ఫిల్ అయిపోతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. దీంట్లో ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి. విదేశాల్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి.. ఇటీవలి సర్వే ప్రకారం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకు టాప్ 10 దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి వివరాల కోస క్లిక్ చేయండి..


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్- 55వ కోర్సు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సుకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీసీ- సి సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  సరైన అర్హతలు గల అబ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్, కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial