JNTU Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఫెయిలవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా మొదటి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గించింది. 


ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ విద్యాసంవత్సరానికి ఏకంగా క్రెడిట్స్ వ్యవస్థనే తొలగించిన సంగతి తెలిసిందే. క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా.. మిగిలిన సెమిస్టర్లలో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. వర్సిటీ అధికారులు మాత్రం.. విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

ఫెయిల్ అవడానికి అదే కారణమా?
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే వందల మంది ఉత్తీర్ణులు కాకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌లో తెలుగు మాధ్యమం చదివిన వారిలో చాలామందికి ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలో చదవాలంటే ఇబ్బందిగా మారడం, గ్రామాల్లో చదువుకున్న వారు నగరాల పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. ఇక ఉస్మానియా, జేఎన్‌టీయూలలో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు లేకపోవడం కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌లో కొత్తగా వచ్చిన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి కోర్సులపై కొందరు ప్రొఫెసర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదు. దీంతో కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తగ్గిపోయి ఫెయిలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణలు అంటున్నారు. 

డిటెన్షన్ విధానంతో ఆత్మన్యూనత..
డిటెన్షన్ విధానంతో విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం కలుగుతోందని, క్రెడిట్స్ తగ్గింపు కేవలం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితమనే విషయాన్ని గుర్తించాలని కెరీర్ కౌన్సిలర్ బి.రాజశేఖర్ చెబుతున్నారు. పాఠాలు అర్థం కావడంలేదని.. ఫెయిలవుతున్నారని రెండో సంవత్సరానికి ప్రమోషన్ కోసం క్రెడిట్స్‌ను తగ్గించడం సరికాదని, బోధనా ప్రమాణాలు పెంచాలని ఉస్మానియా మాజీ ఉపకులపతి ఎ.రామచంద్రం సూచిస్తున్నారు.


ALSO READ: 
దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్‌

రాబోయే 5 సంవత్సరాలలో (2028 నాటికి) దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 20న ప్రణాళికలను ప్రకటించింది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


టీఎస్ లాసెట్ రెండో విడతలో 3,331 మందికి ప్రవేశాలు, రిపోర్టింగ్ గడువు ఇదే
తెలంగాణలో లాసెట్‌, పీజీలాసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌లో డిసెంబరు 19న సీట్లను కేటాయించారు. అందుబాటులో ఉన్న 3,447 సీట్లకుగాను 10,375 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకొన్నారు. వీరిలో 3,331 మందికి సీట్లు కేటాయించారు. మొత్తం 96 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 116 సీట్లు మిగిలాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో 6,894 సీట్లుండగా 5,912 మంది సీట్లు పొందారు. వీరిలో 3,729 మంది విద్యార్థులు రిపోర్ట్‌ చేశారు. సీట్లు పొందిన వారు డిసెంరబు 23లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...