భారతీయ విద్యా బోర్డు తన అనుబంధ పాఠశాలల విద్యార్థుల కోసం 'మొదటి జాతీయ క్రీడా పోటీ'ని ప్రకటించి చారిత్రాత్మక ముందడుగు వేసింది.

Continues below advertisement


హరిద్వార్‌లో ఘనంగా ప్రారంభం


ఈ పోటీ దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. ఇది విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తుంది. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, జట్టు కృషిని తెలపడం. విద్యార్థులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ బోర్డు లక్ష్యం. ఈ కార్యక్రమం నవంబర్ నెలలో పలు తేదీల్లో జరుగుతుంది. ఇందులో సాంప్రదాయ,  ఆధునిక క్రీడలు రెండూ ఉంటాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నవంబర్ 9–10 తేదీల్లో ఈ పోటీలు నూతన ఉత్సాహంతో జరుగుతాయి.


పతంజలి గురుకులం పాఠశాలలో, రెజ్లింగ్, జూడో, మల్లఖంబ్ వంటి ఉత్తేజకరమైన మ్యాచ్‌లను ప్రేక్షకులు చూస్తారు. అయితే పతంజలి గురుకుల పాఠశాల బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ సహా కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ క్రీడలు విద్యార్థుల శారీరక చురుకుదనాన్ని మాత్రమే కాకుండా వారి వ్యూహాత్మక ఆలోచనను పెంచుతాయని సిబ్బంది తెలిపారు. హరిద్వార్ లాంటి పవిత్ర స్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమం క్రీడల పండుగగా మాత్రమే కాకుండా యోగా సంప్రదాయం నుండి ప్రేరణ పొందిన ఆరోగ్య అవగాహనకు చిహ్నంగా మారనుంది.


నవంబర్ 13–14 తేదీల్లో ఆగ్రాలో వాలీబాల్


హరిద్వార్‌లో స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభం కాగా.. నవంబర్ 13– 14 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని GSS ఇంటర్ కాలేజీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు జరుగుతాయి. తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరంలో బాలురు, బాలికలు నెట్ అంతటా షాట్‌లతో ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. వారి జట్టుకృషి, త్వరితగతిన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను ఇందులో పరీక్షిస్తారు. ఆగ్రాను వేదికగా ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ చారిత్రక నగరం సాంస్కృతిక వారసత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని మిళితం చేస్తుంది.


తరువాత లక్నోలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్


నవంబర్ 17– 18 తేదీల్లో లక్నోలోని లాల్‌బాగ్‌లోని ఇసాబెల్లా థోబర్న్ పాఠశాల అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. అథ్లెటిక్స్ ట్రాక్‌లో పరుగు, లాంగ్ జంప్, త్రోయింగ్ పోటీలు విద్యార్థుల ఓర్పును పరీక్షిస్తాయి. అయితే బ్యాడ్మింటన్ కోర్ట్ వేగవంతమైన ర్యాలీలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. లక్నో రాజరిక ఆకర్షణ ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగానూ, ఆకర్షణీయంగానూ చేస్తుంది.


జైపూర్‌లో యోగా, ఖోఖో పోటీలు


చివరగా, నవంబర్ 21– 22 తేదీల్లో రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ యోగా, ఖో-ఖో పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. యోగా సెషన్‌లు విద్యార్థులకు మానసిక ప్రశాంతను బోధిస్తాయి. అయితే వేగవంతమైన ఖో-ఖో ఆట సాంప్రదాయ భారతీయ క్రీడల శక్తి, విధానాన్ని పెంపొందిస్తుంది. పింక్ సిటీ జైపూర్‌లో జరిగే ఈ కార్యక్రమం సాంస్కృతిక వైవిధ్యానికి చిహ్నంగా నిలవనుంది.


ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో క్రమశిక్షణ, నాయకత్వం, ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భారతీయ విద్యా బోర్డు అధ్యక్షుడు మాట్లాడుతూ.. "ఇది కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది దేశ నిర్మాణానికి ఒక విత్తనం లాంటిది" అన్నారు.


ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించనున్నారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుతో పాటు స్పోర్ట్స్, ఇతర ఈవెంట్లను ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. మొదటి జాతీయ క్రీడా పోటీ విద్య, క్రీడల సమ్మేళనానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిరూపించనున్నారు. ఇది రాబోయే సంవత్సరాల్లో ఆదరణ పొందే సంప్రదాయంగా మారే అవకాశం ఉంది.